అర్థశతకంతో అలరించిన జాస్ బట్లర్.. ధోని సేనకు ఓటమి..!
అంతకముందు టాగ్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కేలో రవీంద్ర జడేజా (35*; 30 బంతుల్లో 4x4) టాప్ స్కోరర్గా నిలిచాడు. సారథి ధోనీ (28; 28 బంతుల్లో 2x4), ఓపెనర్ సామ్కరన్ (22; 25 బంతుల్లో 1x4, 1x6) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల చెన్నై బ్యాట్స్మెన్ ఏ దశలోనూ ధాటిగా ఆడలేకపోయారు. ఆది నుంచి వికెట్లు కోల్పోయారు. జట్టు స్కోర్ 13 పరుగులకే డుప్లెసిస్ (10) ఔటవ్వగా తర్వాత 26 పరుగుల వద్ద షేన్ వాట్సన్ (8) ఔటయ్యాడు. ఆపై అంబటి రాయుడు (13), సామ్కరన్ వికెట్లు కాపాడుకునేందుకు ప్రయత్నించినా వీరిద్దరూ వెనువెంటనే ఔటయ్యారు.