పిల్లలే పెరిగే కొద్దీ తల్లి మాట ఎందుకు వినరో తెలుసా ?

VAMSI
తల్లి బిడ్డ బంధం చూడ ముచ్చటగా ఉంటుంది. బిడ్డ పుట్టినప్పటి నుండి పలకడం, నడవడం చేసే వరకు తల్లి పడే తపన చెప్ప లేనిది. అయితే ఆ బిడ్డ పెరిగే కొద్దీ తన తల్లి మాటంటేనే పడనట్లు తయారవడం కాస్త ఆశ్చర్యంగా ఉండటంతో పాటు కొంచెం బాదగా కూడా ఉంటుంది. అంతేకాదు పిల్లలు అలా చేంజ్ అవ్వడానికి  కొన్ని కారణాలు ఉన్నాయని చెప్తున్నారు మన పరిశోధకులు. మరి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనం ప్రకారం పిల్లలు యుక్త వయస్సులోకి ప్రవేశించిన తర్వాత తల్లి స్వరంతో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోవడం వలన బిడ్డ బిహేవియర్ మారవచ్చునని, అలాగే పిల్లలు పెరుతుగున్న కొద్దీ తల్లి గొంతు కంటే ఇతర స్వరాలకు ట్యూన్ చేయడం ప్రారంభించడమే దానికి కారణమని నిపుణులు అంటున్నారు.
అంతేకాదు పిల్లలు తమకి 13 ఏళ్లు వచ్చే సరికి వారి తల్లి స్వరం కటువుగా, అసౌకర్యంగా భావించవచ్చునని, అంటే "పుట్టినప్పుడు తల్లి స్వరంతో ఎలా ట్యూన్ అయ్యేవారో, అలాగే కౌమార దశ వచ్చే సమయానికి వేరే స్వరాలకు ట్యూన్ అవడం జరుగుతుంది. అంతేకాదు పిల్లలకు యుక్త వయసులో స్నేహితులు, కొత్త సహచరులు ఉండటంతో వారితో టైమ్ గడపాలి అని అనుకుంటారట.. అలాగే టీనేజ్ మెదడు గల వారు వినే అన్ని స్వరాలకు ఎక్కువ గ్రహణ శీలత కలిగి ఉండటంతో ఈ వయస్సులో రివార్డ్ సర్క్యూట్ కు సంబంధించిన మెదడు కేంద్రాలు ముఖ్యమైన ఉద్దీపనలకు ప్రాధాన్యతనిచ్చే మార్పులు జరుగుతుంటాయి.
అందులో బాగంగానే బిడ్డలోని ఈ మెదడు ప్రాంతాలు తల్లి స్వరం కంటే తెలియని స్వరాలకు ఎక్కువ ప్రతిస్పందిస్తాయని తెలుస్తోంది. అయితే టీనేజర్లు ప్రపంచంతో ఎక్కువగా సంబంధం ఏర్పరుచుకోడానికి ఈ మార్పు సహాయపడుతుందని, అలాగే బయట సామాజిక నైపుణ్యం  ఏర్పరచుకోవడంలో వారికి సహాయపడుతుందని వివరించారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: