భారత్ లో అబార్షన్లకు అదే కారణం.. తేల్చేసిన శాస్త్రవేత్తలు

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని నెలల్లో పసి పాప కేరింతలతో ఇల్లు కలకళలాడుతుందనుకుంటే ఉన్నట్లుండి గర్భం పోతుంది. ఆ ఇంట్లో విషాదం నింపుతుంది. కడుపులో ఉన్న పిండం కడుపులోనే చనిపోతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు... ఏటా లక్షల్లో ఇలాంటి అవాంఛనీయ అబార్షన్లు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ అబార్షన్లు ఇక మీదట మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాల్లో తేలింది. దీనికి కారణం ఏంటో కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అదేంటో తెలుసా..? కాలుష్యం. 



అవును.. కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోవడానికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని చైనాకు చెందిన పెకింగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా వారు చేసిన అధ్యయనంలో అవాంఛనీయ అబార్షన్లకు అసలైన కారణం బయటపడింది. గాలిలో పెరుగుతోన్న కాలుష్యమే ఇందుకు ముఖ్య కారణమని తేల్చి చెబుతున్నారు. గర్భంలో బిడ్డ భూమ్మీదికి రాకుండా దాని ఉసురు తీసి, తల్లులకు కడపుకోత మిగుల్చుతోంది వాయు కాలుష్యమేనని వారంటున్నారు.

ఈ అబార్షన్ల సమస్య ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉందట. ముఖ్యంగా ఈ సమస్య భారత్ లోనే కాకుండా దక్షిణాసియా దేశాల్లో 29 శాతం ఉందట. ఆయా దేశాల్లో కూడా ఈ అబార్షన్లకు వాయుకాలుష్యమే కారణమని చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైందట.



గత 16 ఏళ్లలో ప్రతి ఏడాది సగటున 3,49,681 అబార్షన్ల చొప్పున అధికారికంగా నమోడయ్యాయని, ఇక అనధికారికంగా కూడా మరికొన్ని జరిగి ఉండవచ్చని, వీటికి కారణం వాయు కాలుష్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంతేకాదు ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందట. డబ్ల్యూహెచ్ఓ నిర్దేశాల ప్రకారం.. కాలుష్య కారకమైన పీఎం 2.5 పరమాణువులు ఒక ఘనపు మీటరు గాలిలో 10 మైక్రోగ్రాములకు మించి ఉండకూడదు. కానీ దక్షిణాసియా దేశాల్లో అది 40 మైక్రోగ్రాముల మేర ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. విచిత్రం ఏమంటే మనదేశంలో అధికంగా 77 శాతం అబార్షన్లు వాయు కాలుష్యం వల్లే జరుగుతున్నాయట. ఆ తర్వాత పాకిస్థాన్ లో 12 శాతం, బంగ్లాదేశ్ లో 11 శాతం అబార్షన్లు ఈ గాలి కాలుష్యం వల్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: