ఆ స్పర్శతోనే.. తేడాలు గమనించాలి- రకుల్

Raghava Raghava

స్పర్శలో తేడాలు గమనించాలని, ముఖ్యంగా ఇది విద్యార్థి దశలోనే  తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి, చెడు స్పర్శలపై అవగాహన కల్పించాలని తెలిపారు. అప్పుడే బాలికలు, యువతులపై జరుగుతున్న లైంగిక దాడులు కొన్నైనా ఆపవచ్చు అని సినీ నటి రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు.  తాజాగా ఈ భామ శనివారం వైజాగ్‌లో జరిగిన `555 కిలో మీటర్ల 2.0 వాక్‌` ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది. కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ.. ఓ ఉపాధ్యాయుడు ఒక విద్యార్థినికి ప్రతి రోజు చాక్లెట్‌ ఇచ్చేవాడని, అలా ఇస్తూ తనను తాకేవాడని.. అదే విద్యార్థి తన తన తల్లి వద్ద చాక్లెట్‌ తీసుకున్నప్పుడు ఆమె చేతి స్పర్శ గమనించిందని, ఉపాధ్యాయుడి చేతి స్పర్శ, తల్లి చేతి స్పర్శలో తేడా ఉండడంతో టీచర్‌పై ఫిర్యాదు చేసిందన్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నందున వారికి స్కూళ్లలోనే ఈ విషయం తెలియజేయాలన్నారు.

 ఈ సందర్భంగా సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారి భద్రత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలకు చిన్న వయసు నుంచే లైగింక వేదింపుల మీద అవగాహన కల్పించాలని అభిప్రాయ పడింది రకుల్‌.ముఖ్యంగా సమాజంలో అమ్మాయిలను ఇబ్బంది పెట్టేలా అసభ్యంగా తాకేవాళ్లు ఎక్కువవుతున్నారని, అలాంటి వాళ్లను ముందుగానే పసిగట్టేలా అమ్మాయిలను మానసికంగా సిద్ధం చేయాలనంది రకుల్‌. అలా చేసే వాళ్లు తేడాగాళ్లని ముందే పసిగట్టాలి. వారి గురించి వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన నిర్వహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

నేటి సమాజంలో బాలలపై జరుగుతున్న హింస, లైంగిక దాడుల విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఫిట్‌ ఇండియా, పోలియో నిర్మూలన దిశగా ముందడుగు వేసేందుకు 18వ తేదీన ఈ యాత్ర ప్రారంభించామన్నారు. ఈ వాక్‌ విజయవాడలో ప్రారంభించి గుడివాడ, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, అమలాపురం, రాజోలు, యానాం, రామచంద్రపురం, రాజమండ్రి, తుని, అనకాపల్లి మీదుగా సాగిందని తెలిపారు.  ఈ 5రోజుల యాత్రలో 55మంది సభ్యులు సుమారు 425 స్కూళ్లను సందర్శించి, 65వేల మంది విద్యార్థులకు, తల్లితండ్రులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. దీనిలో 11 గ్రామాలను, సిటీలను ఎంపిక చేసుకుని అక్కడ ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న స్వచ్ఛంధ సేవాసంస్థలతో కలిసి పనిచేసినట్టు రమేష్‌ వివరించారు. కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన కరాటే రికార్డ్‌ చాంపియన్‌ అమినేష్‌ వర్మను ప్రత్యేకంగా అభినందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: