వైరల్: ఎద్దుల బండి పై విహరిస్తున్న టీమ్ ఇండియా ప్లేయర్.. వీడియో వైరల్..!!

Divya
టీమిండియా క్రికెట్ ప్లేయర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకొని త్వమ స్వస్థలానికి వెళుతూ ఉన్నారు భారత క్రికెటర్లు.. ఒక్కొక్కరు ఒక్కోలా తమ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు తన ఫ్యామిలీతో గడుపుతుంటే ఇంకొందరు వారికి నచ్చినట్టుగా ప్రకృతిని ఆహ్వాదిస్తున్నారు.
భారత ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా తన చిన్ననాటి జ్ఞాపకాలను మర్చిపోకుండా.. ఎద్దుల బండి పై వివరిస్తూ తన విరామ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.భారత జట్టు సఫారీ పర్యటనను విజయవంతంగా ముగించేశారు. వన్డే సిరీస్ ను 2-1 తేడాతో  టీమిండియా దక్కించుకుంది... టెస్ట్ T 20 సిరీస్ లను డ్రా తో సరిపెట్టుకుంది.. ఈ పర్యటన నుంచి స్వదేశానికి చేరుకున్న భారత ఆటగాళ్లు.. జనవరి 11 నుంచి ఆఫ్గానిస్థాన్తో ఆడాల్సి ఉన్నది. మరో నాలుగు రోజులు సమయం ఉండటంతో భారత క్రికెటర్లు ఈ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉపయోగిస్తున్నారు

అయితే జడేజా తన సొంతూరు రాజ్ కోట్ లో ఎద్దుల బండి పై విహరిస్తూ ఉండగా అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు క్రికెటర్లు కూడా అగునాతన కార్లు బైకుల పైన విహారయాత్రలు చేస్తూ ఉంటే టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా మాత్రం ఇలా ఎద్దుల బండి పైన కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు మరి కొంతమంది ఈ దృశ్యాలను చూసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా రవీంద్ర జడేజా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారంటూ అభిమానులు తెలుపుతున్నారు గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమైన జడేజా రెండో టెస్టులో ఆడుతారా లేదా అనే విషయం ఇంకా తెలియలేదు.. గత ఏడాది ఐపీఎల్ లో చెన్నై టీం ని గెలిపించడం జరిగింది రవీంద్ర జడేజా.. రవీంద్ర జడేజా కు సంబంధించి ఈ వీడియో క్షణాలలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: