సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని వార్తలు వైరల్ అవుతుంటాయి..అందులో కొన్ని క్రియెటివ్ ఐడియా లతో జనాలను తెగ ఆకట్టుంటాయి. అలాంటి వాటికి ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహింద్రా ఫిధా అవుతూంటారు. ఆయనకు నచ్చిన వీడియోల పై సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినా, ఆయన కళ్లు ఎప్పుడూ కొత్తదనాన్ని వెదుకుతూ ఉంటాయి.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా టాలెంట్ను వెదికిపట్టుకుని మరీ అభినందించడం ఆయన స్టైల్.. సామాన్యుల అసాధారణ విజయాలను ప్రపంచానికి పరిచయంచేసే మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కదిలే ఏసీ కల్యాణ మండపం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. కదిలే మ్యారెజ్ హాల్ను చూసిన ఆనంద్ మహింద్రా వెంటనే దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. కంటైనర్ను కదిలే ఏసీ ఫంక్షన్ హాల్గా మార్చిన నిర్వాహకులను అభినందించారు.కదిలే మ్యారెజ్ హాల్ను చూసిన ఆనంద్ మహింద్రా వెంటనే దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. కంటైనర్ను కదిలే ఏసీ ఫంక్షన్ హాల్గా మార్చిన నిర్వాహకులను అభినందించారు. వినూత్న ఆలోచన, కొత్తదనం చూపిస్తూ రూపొందించిన మూవింగ్ ఫంక్షన్ హాల్ టీమ్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ అద్భుతాన్ని సృష్టించిన వ్యక్తిని తాను కలవాలనుకుంటున్నట్లు తెలిపారు ఆనంద్ మహీంద్రా..
రెగ్యులర్ ఫంక్షన్ హాల్స్ తరహాలోనే 12వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఏసీ హాల్ను తీర్చిదిద్దారు నిర్వాహకులు. 40 అడుగులు పొడవు ఉండే ఈ కంటైనర్ను ఫోల్డ్ చేసేవిధంగా స్ట్రాంగ్ మెటీరియల్తో రూపొందించారు. ఈ ఫోల్డింగ్స్ను ఓపెన్ చేస్తే మరో 30 అడుగుల విస్తీర్ణం పెరిగేలా తయారు చేశారు. ఈ ఫంక్షన్ హాల్లో 200మంది దర్జాగా కూర్చొని కార్యక్రమం నిర్వహించుకునేలా డిజైన్ చేశారు. ఇంకా సౌండ్ సిస్టమ్, జనరేటర్స్, లైట్స్ అండ్ స్టేజ్, స్టైలిష్ డెకరేషన్ అండ్ కేటరింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం అన్నీ కలిపి 50వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు..ఆనంద్ మహీంద్రా పోస్ట్ ఈ కదిలే ఫంక్షన్ హాల్ ను చూసిన వారంతా అభినందిస్తున్నారు..మొత్తానికి ఈ వీడియో ట్రెండ్ అవుతుంది..