ఓరి నాయనో..ఏం తెలివిరా బాబు..దోస అదుర్సు..

Satvika
కరోనా తర్వాత చాలా మందికి చావు తెలివి వచ్చింది.. దాదాపు రెండేళ్ళు క్షణం క్షణం భయంతో వణికిపోయారు. ఎప్పుడూ ఎవరికీ వస్తుందో అని చస్తూ బ్రతికారు. ఎప్పుడయితే కరోనా భయం జనాలకు తగ్గిందో అప్పటి నుంచి తెలివిలొ మితి మీరుతున్నారు.దాంతో ఏదోకటి చెయ్యాలి అనుకొని ఏవో ప్రయోగాలు చేస్తున్నారు.. ప్రస్తుతం వేసవి ఎక్కువ కావడంతో అందరు ఎండ పై కామెంట్లు చేస్తున్నారు.. ఎండను ఇలా వాడుకోవడం మంచిది అని అంటున్నారు. గతంలో ఓ మహిళ ఎండ వేడిని వాడుకొని కారు పై చపాతీలు చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది.


హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.స్కూటీ సీటును ఇలా కూడా వాడొచ్చా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇంతకూ హైదరాబాదీ స్కూటీ సీటుపై ఏం ప్రయోగం చేశాడు. వివరాల్లొకి వెళితే.. మాములుగా అందరూ స్కూటిని స్కూటీ సీటును దేని కోసం ఉపయోగిస్తారు? అని అడిగితే.. ఈ మాత్రం తెలియదా.. కూర్చోవడానికి తప్ప స్కూటీ సీటు ఇంకెందుకు వాడతారు అంటూ ఠక్కున సమాధానం చెబుతారు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఈ అభిప్రాయాన్ని తప్పని నిరూపించాడు.

 
వంటకాలు చేయడానికి కూడా స్కూటీ సీటును వాడుకోవచ్చని స్పష్టం చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాల నిజం.వేసవి కావడంతో భానుడి భగభగలు హైదరాబాద్‌లో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సుమారు 40 సెంటీగ్రేడ్‌ల ఎండలో యువకుడు.. తన స్కూటీ సీటుపై చక్కగా దోష తయారు చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది..ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి అలా జరిగింది..ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: