రైలులో సమోసా తింటున్నారా?

Satvika
ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేవాల్లు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు.. ఫ్యామిలి మొత్తం వెళ్లాడానికి సౌకర్యంగా ఉండటానికి ఈ మార్గం బెస్ట్ అని చెప్పాలి..అయితే, ఎక్కువ మంది భోజనాన్ని కూడా కలిపి తీసుకుంటారు..కొన్ని సార్లు ప్రభుత్వ కేటరింగ్ కాబట్టి భోజనం అంత సరిగ్గా ఉండదు. అందుకే అంటారు ప్రభుత్వ తీరు మారదు అని. మరి కొన్ని సార్లు స్టాక్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా సప్లై చేస్తారు..అవి పాడై పోవడంతో ప్రయాణీకులు అనేక ఇబ్బందులు కూడా పడతారు..ప్రయాణాల్లో దోపిడీ కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఛార్జీల పేరుతో ప్రయాణికుల్ని బాదేస్తారు. ప్రభుత్వ రవాణా సంస్థలైతే సమయాపాలన లేకుండా ఇబ్బంది పెడతారు.



ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రైల్వే లాంటి పెద్ద రవాణా సంస్థల్లో దోపిడీ వేరే స్టైల్లో ఉంటుంది. తక్కువ ఛార్జీతో సురక్షితమైన ప్రయాణం చేయవచ్చని భావించే వారికి రైళ్లలో ఆహార పదార్ధాలు, తినుబండారాలు విక్రయించే వాళ్ల రూపంలో దోపిడీ చేస్తుంటారు. రైళ్లలో ప్రయాణం చేస్తున్న వాళ్లు మీకో సూచన. ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లో లాంగ్ జర్నీ చేస్తున్నారా. అయితే ట్రైన్‌లో ఏదైనా తినే పదార్ధాలు విక్రయించడానికి వస్తే వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయండి..అయితే ట్రైన్‌లో ఏదైనా తినే పదార్ధాలు విక్రయించడానికి వస్తే వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయండి. లేదంటే డబ్బుతో పాటు మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.



మధ్యప్రదేశ్‌లో దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో విచిత్రమైన సంఘటన జరిగింది. రైల్వే క్యాంటిన్‌లో తయారు చేసిన ఆలు సమోసాలు అమ్మేందుకు వచ్చాడు ఓ వ్యక్తి. బోగీ అంతా ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఆకలితో ఉన్న ప్రయాణికులు సమోసాలు కొనుగోలు చేశారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ట్రైన్‌లో అమ్ముతున్న ఆలుగడ్డ  సమోసాలో ఆలుగడ్డలు లేకుండా కేవలం ముక్కిపోయిన బియ్యం మిగిలినపోయిన అన్నం పెట్టి తయారు చేసినట్లుగా ఉన్నాయి..నాగ్‌పూర్‌ వెళ్తున్న ఇద్దరు యువకులు సమోసాలు కొనుగోలు చేశారు. తినడానికి వాటిని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆలుగడ్డ సమోసాలో ఆలుగడ్డలు పెట్టలేదు కదా..వాటికి బదులు ముక్కిపోయిన బియ్యంతో చేసిన అన్నం పెట్టి తయారు చేశారు. సమోసాల్లో ఉన్న పదార్ధం చూసిన యువకులు సమోసాలు విక్రయించే వ్యక్తినిపై మండిపడ్డారు.. ఈ గొడవను ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం తో అది వైరల్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: