ఇలాంటి ఆచారం ఎక్కడా చూడలేదు..మూడు రోజులు అలా..

Satvika
సైన్స్ ఎంతగా పెరిగినా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మూఢ నమ్మాకాలు కూడా అంతకు మించి పెరుగుతూన్నాయి.అయితే కొన్ని ఆచారాలు జనాలను పిచ్చివాల్లను చెస్తున్నాయి.వాటిని పాటించడం కన్నా, వాటి గురించి విన్న వాల్లు మాత్రం ఖంగుతినడం ఖాయం..ఇప్పుడు అలాంటి ఒక ఆచారం అందరినీ ఆలోచనలో పడవేస్తుంది.వివాహం జరిగిన సమయంలో ఏవేవో ఆచారాలు చూస్తుంటాం.. అయితే.. ఇండోనేషియాలోని ఓ తెగ వారు పెళ్లి తర్వాత మూడు రోజుల పాటు మరుగుదొడ్డిని ఉపయోగించకూడదని కొత్త జంటకు నిషేదాజ్ఞలు విధించారు.


ఒక నిమిషం కూడా మనం ఆపుకోలేక పొథాము..కానీ మూడు రోజులు అలా ఎలా ఉంటారు అనే సందేహం అందరికి ఉంటుంది. ఇండోనేషియా లోని టిడాంగ్ కమ్యూనిటీ కి చెందిన వారు.. వివాహం తర్వాత మూడు రోజుల పాటు వాష్‌ రూమ్‌ను ఉపయోగించకుండా కొత్త జంటకు నిషేధం విధిస్తారు.. ఈ నియమాన్ని ఉల్లంఘించడం జంటకు దురదృష్టం వెంటాడుతుందని ఈ తెగకు చెందిన ప్రజలు విశ్వసిస్తారు. వైవాహిక జీవితంలో పొరపచ్చాలు, విడిపోవడం, జంటలో విశ్వాసం తగ్గడం, చిన్న వయస్సులోనే వారి పిల్లలు మరణిస్తారని ఇలా ఏవేవో నమ్ముతారు.


ఓ జంటకు కూడా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఫొటోలో ఉన్న జంటను చూస్తున్నారు కదా.. వీరికి కూడా వివాహమైంది. అయితే.. వారిని ఇంటి లోపలకు పంపిన టిడాంగ్ తెగ కు చెందిన కుటుంబ సభ్యులు తక్కువ మొత్తంలో ఆహారం, పానీయాలను మాత్రమే అనుమతించారు. మూడు రోజుల తర్వాత వారు స్నానం చేసి ఆపై మరుగుదొడ్డిని ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది. ఇకపోతే బెడ్ రూమ్ ఉన్న ప్రాంతంలో అయితే బాత్ రూమ్ వుంటే బంధువులు వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉంటారు. మోసం చేయకుండా ఛాలెంజ్‌ పూర్తిచేసేలా జంటలు ప్రయత్నిస్తుంటాయి.. అలా మూడు రోజులు ఉన్న వాళ్ళు మాత్రమే హాయిగా ఉంటారని అంటారు..ఇదేం ఆచారం రా బాబూ అని కొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: