వైరల్ : కంటి ముందు రూ.1448 కోట్లు వున్నా.. ముట్టుకోలేని పరిస్థితి..!
పూర్తి వివరాల్లోకి వెళితే.. అతని పేరు జార్జ్ వళానీ.. 1978 వ సంవత్సరం లో ఆయిల్ అండ్ జనరల్ మిల్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసేవారు.. ఈ కంపెనీకి కేంద్రంగా ఉదయపూర్ ఉండడం గమనార్హం.. ఈ కంపెనీ యజమానులతో ఈయనకు ఉన్న మంచి సంబంధాల కారణంగా .. కంపెనీకి సంబంధించిన 3500 షేర్లను కొనుగోలు చేయడం జరిగింది.. ఆ తర్వాత వయసు మీద పడటం తో డిస్ట్రిబ్యూషన్ వ్యవహారానికి పక్కనపెట్టి విశ్రాంతి తీసుకుంటూ ఆ షేర్ల గురించి ఆయన మరిచిపోయాడు.
అయితే ఇటీవల ఆయన ఇంట్లో ఉన్న పాత పేపర్లను సర్దుతున్న సమయంలో.. ఆ షేర్లకు సంబంధించిన కొన్ని పేపర్లు బయటపడ్డాయి.. అయితే వీటిని ఆయన డిమార్ట్ గా మార్చాలని అనుకోగా అవి.. అప్పటికే ఆయిల్ అండ్ జనరల్ మిల్స్ లిమిటెడ్ కంపెనీ తన పేరును సి ఐ ఇండస్ట్రీస్ గా పేరు మార్చుకుంది. అప్పట్లో జార్జ్ కొనుగోలు చేసిన మూడు వేల ఐదు వందలు షేర్ల విలువ ప్రస్తుతం రూ.1448 కోట్లు.
ఈ షేర్ల విలువ తెలుసుకున్న జార్జ్ వెంటనే కంపెనీ మేనేజ్మెంట్ను కలిశారు. వారు అప్పటికే డూప్లికేట్ పేరుతో ఆయన షేర్లను ఇతర వ్యక్తులకు బదలాయించారని తెలియడంతో జార్జ్ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యాడు. ఈ విషయాన్ని సెబీకి కూడా తెలియజేశాడు. సెబీ లిస్టింగ్ కంపెనీ..పీఐ ఇండస్ట్రీస్ వారిని వివరణ కోరింది. కానీ..ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం జార్జ్ తన షేర్లకోసం యుద్ధం చేస్తున్నాడు. మరి ఆయనకు తన షేర్లు దక్కుతాయో..లేదో.. చూడాలి.