దేవుడు కరుణించడమంటే ఇదేనేమో.. ఆమె కవల పిల్లల వెనుక చరిత్ర ఇదేనా..?

MOHAN BABU
దేవుడు ఈ తల్లిని కరుణించాడు. ఆమె ఏ రోజైతే వారి బిడ్డలను పోగొట్టుకుంది, మళ్లీ అదే రోజున పండంటి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో తల్లిదండ్రులు శోకం తిరిగి పోయింది. వారికి డాక్టర్లు ఇచ్చిన తేదీ కంటే ముందే పిల్లలు జన్మించారు. కొద్ది సంవత్సరాల క్రితం ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆ పిల్లలిద్దరినీ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకరోజు  వీరు పిల్లలతో కలిసి రామయ్య దర్శనం కోసం పడవలో బయల్దేరారు. ఆ పడవ పాపికొండల వరకు చేరుకుంది. ఆ అందాలను చూస్తూ, వారిద్దరు పిల్లలకు చూపిస్తూ  అనంత ఉత్సవాల్లో మునిగిపోయారు.

ఇంతలో ఊహించని ప్రమాదం. గోదావరి ఉగ్రరూపం దాల్చి వారు ప్రయాణిస్తున్న పడవను ముంచేసింది. ఈ యొక్క ప్రమాదంలో ఇద్దరు పిల్లలు  మృతి చెందారు. అప్పటిదాకా తమ యొక్క జీవితాలలో వెలుగులు నింపే అటువంటి పిల్లలు  ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో వారి జీవితంలో చీకట్లు అలుముకున్నాయి. ఈ 2019 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద ఈ బోర్డు ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదం వెనుక విషాదం ఇద్దరు దంపతులు గర్భశోకాన్ని  మిగిల్చింది. అలా వారు రెండు సంవత్సరాల వరకు బాధపడుతూ వచ్చారు.

ఇంతలో దేవుడు కరుణించాడు ఏమో కానీ వారికి  వారి బిడ్డలు దూరమైన రోజే మళ్లీ ఇద్దరు పిల్లలు కవలలు జన్మించారు. అయితే ఈ ప్రమాదంలో ఈ యొక్క దంపతులిద్దరూ ప్రాణాలతో బయట పడగా వారిద్దరూ పిల్లలతో పాటు వారి బంధువులు అంతా  ప్రాణాలు  కోల్పోయారు. ఈ విధంగా  వారు రెండు సంవత్సరాలు నరకయాతన అనుభవించి ఐ వీ ఎఫ్ ద్వారా పిల్లలు పుడతారు అని తెలుసుకొని  డాక్టర్ దగ్గరికి వెళ్లి సంప్రదించారు. దీంతో వారికి  ఇద్దరు కవల పిల్లలు కూడా పుట్టారు. సరిగ్గా వారు కూడా  వారి పడవ ప్రమాదం జరిగి ఏ రోజైతే వారి పిల్లలు చనిపోయారో అదే రోజున మళ్లీ ఇద్దరు కవల పిల్లలు జన్మించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: