వైరల్ : ఆ పోటీలో గెలిస్తే గేదెని బహుమతిగా ఇస్తారట....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మాములుగా ఏదైనా పోటీలో గెలిస్తే ఎలాంటి నజరానా ఇస్తారు.ఏ వెండి కప్పో బంగారు కప్పో ఇస్తారు వాటితో పాటు డబ్బును కూడా ఇస్తారు.ఇక  జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతూ ఉంటాయి. ఇక అలాంటి  పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపే క్రీడాకారులు మెడల్‌తోపాటు భారీ బహుమతిని కూడా ఇంటికి తీసుకెళ్లవచ్చు. అయితే, ఈ సారి బహుమతి మరింత భారీగా ఉండాలని నిర్వాహకులు భావించారో ఏమో! తెలీదు కాని ఈసారి వెరైటీగా ప్రైజ్ మనీకి బదులు.. బాగా పాలిచ్చే గేదెను బహుమతిగా ఇస్తామని ప్రకటన చేశారట. అదేంటీ.. అని ఆశ్చర్య పోతున్నారా? ఔనండి నిజం.. ఆగ్రాలో జరుగుతున్న నేషనల్ ఉమెన్ రైజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఉత్తమ క్రీడాకారిణికి గేదెను బహుమతిగా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట నిర్వహకులు..

ఈ జాతీయ పోటీల్లో గెలిచి విజేతగా నిలిచే ఉత్తమ రెజ్లర్ రూ.1.5 లక్షలు విలువ చేసే గేదెను ఇంటికి తీసుకెళ్లవచ్చని నిర్వాహకులు తెలిపడం జరిగింది. అదేంటీ? వీరికి మతిపోయిందా? అని అనుకుంటున్నారా? అయితే, ఈ గేదెను వారికి బహుమతిగా ఇవ్వడానికి వారు చెప్పిన కారణాన్ని కూడా మీరు తెలుసుకుంటే మీకు పూర్తి విషయం అర్ధమవుతుంది.అలా బహుమతిగా అందించే గేదె ద్వారా.. ఆ విజేతకు నిరంతరం ప్రోటీన్లు అందజేయడమే తమ ఉద్దేశమని చెబుతున్నారు. అంటే.. ఆ క్రీడాకారుడు ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్లను పాలను తాగి మరింత బలంగా తయారు కావచ్చని వారి అభిప్రాయం. అయితే, ఈ బహుమతిపై తుది నిర్ణయం తీసుకొనేందుకు కమిటీ ఏర్పాటు చేశామని ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ ప్రసాద్ వెల్లడించారు.డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఈ ఆలోచనల కలిగిందని, ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారని ప్రసాద్ తెలిపారు.

 ఒక వేళ ఉత్తమ రెజ్లర్‌కు గేదెను అందించలేకపోతే.. రూ.1.5 లక్షల నగదును చెల్లిస్తామని తెలిపారు. అయితే, ఆటల్లో ఇలాంటి అరుదైన బహుమతులు అందించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కశ్మీర్‌లోని కుప్వార్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా చేపను బహుమతిగా అందించడం జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: