బుల్లిపిట్ట: సామాన్యులు కూడా కొనగలిగే ఎలక్ట్రిక్ సైకిల్..

Divya
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువుల వైపే మొగ్గు చూపుతున్నారు ప్రజలు. అయితే ఇదే తరుణంలోనే భారతదేశానికి చెందినటువంటి ఎలక్ట్రిక్ సైకిల్ స్టార్టప్ ఓల్ట్రో మోటార్స్. ఈ సంవత్సరంలో కొంచెం మొత్తంలో రూ.10 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ వాహనాలను తయారు చేస్తున్నది.

 లాక్ డౌన్ తీసివేసిన తర్వాత చిన్నచిన్న నగరాలలో ప్రస్తుతం ఎక్కువగా ఎలక్ట్రిక్ సైకిల్ కు బాగా ఆదరణ పెరుగుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఓల్ట్రో మోటార్స్ అధినేత మాట్లాడుతూ ..ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ల  కారణంగా.. ప్రారంభం మొదట్లో ఎన్నో కష్టాలు వచ్చాయని, కానీ ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో మొదట చిన్న చిన్న నగరాలలో వీటిని పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు.
ఓల్ట్రో సైకిల్  పూర్తి ఛార్జింగ్ చేస్తే 75 నుండి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అలా వెళ్లేందుకు ఎలక్ట్రిక్ సైకిల్ లోని ఒక లిథియం ఫాస్పేట్ బ్యాటరీని అమర్చినట్లు తెలిపింది. ఈ సైకిల్ ధర రూ.35,000 వేల రూపాయలు ఉండనున్నట్లు తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఈ మోటార్ సైకిల్ 700 wates శక్తిని వినియోగిస్తుంది. ఈ సైకిల్ కి ఫుల్ చార్జింగ్ కావాలంటే కనీసం మూడు గంటలు వేచి ఉండాల్సిందే.
ఈ కంపెనీ మొదట ఆగస్టు 2020లో ప్రారంభించింది. తన మొట్టమొదటి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.35 లక్షల టర్నోవర్ ను  పూర్తి చేసుకున్నది. లాక్ డౌన్  సమయం లేకుంటే దాని ఉత్పత్తి రూ.8నుంచి రూ.10 కోట్ల వరకు ఈ వాహనాలు అమ్ముడు పోయేవని తెలియజేశారు. అంతేకాకుండా వీటిని ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చని ఆయన తెలియజేశారు.
ఇక అంతే కాకుండా తర్వాత నెలలో దక్షిణాఫ్రికాకు కూడా వీటిని ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిని బాగా ఉత్పత్తి చేసేందుకు ఢిల్లీలో కొన్ని ఫ్యాక్టరీలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది సామాన్యులకు తక్కువ బడ్జెట్ లో  అందించనున్నట్లు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: