జియో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు జియో కంపెనీ తన కస్టమర్లకు మంచి మంచి ఫీచర్లను అందిస్తుంది. ఇక తాజాగా జియో తన కస్టమర్లకు మంచి తీపికబురును అందించడం జరిగింది. ఇక జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి వెబ్ కెమెరా అనేది లేకుండా టీవీల్లో వీడియో కాలింగ్ చేసే సదుపాయాన్ని జియో కంపెనీ తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. 'కెమెరా ఆన్ మొబైల్' అనే ఈ కొత్త ఫీచర్తో యూజర్లు తమ టీవీల్లో వీడియో కాలింగ్ ఆప్షన్ను ఈజీగా పొందవచ్చును. ఇక అందుకోసం జియోజాయిన్ అనే యాప్ను జియో యూజర్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇక గత కొన్ని నెలలుగా 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్ను జియో పరీక్షిస్తూ వుంది.ఇక ప్రస్తుతం ఈ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ ఇంకా ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది.
ఇక జియోఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను వినియోగించుకునే కస్టమర్లకు ఇక జియో ఫైబర్వాయిస్తో వీడియోకాలింగ్ ఆప్షన్ను ఎనెబుల్ చేయవచ్చునట.ఇక కస్టమర్లు తమ మొబైల్లోని జియో జాయిన్ యాప్ ద్వారా ల్యాండ్లైన్ నంబర్లకు కూడా వాయిస్కాల్స్ ఈజీగా చేసుకోవచ్చును.ఇక మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా జియో యూజర్లు తమ టీవీలో వీడియో కాల్ అనేది చేయడానికి ముందుగా పది అంకెల జియో ఫైబర్ నంబర్ను జియో జాయిన్ యాప్లో నమోదు చేయాలట.అలాగే జియో ఫైబర్ నంబర్ను నమోదు చేసిన తర్వాత అలాగే జియో జాయిన్ యాప్ సెట్టింగ్లలో 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్తో వీడియోకాల్స్ ఈజీగా చేసుకోవచ్చును. అలాగే స్పష్టమైన వీడియో కాలింగ్ సేవల కోసం జియోఫైబర్ మోడమ్ను 5GHz Wi-Fi బ్యాండ్కి కూడా మార్చాల్సి ఉంటుంది. ఇక 2.4GHz బ్యాండ్లో కూడా వీడియో కాలింగ్ ఫీచర్ను ఈజీగా పొందవచ్చును. అయితే ఇక వీడియో కాలింగ్లో మాత్రం కొంత అస్పష్టత అనేది ఉండవచ్చును