టీవీ: యాంకర్ ఓంకార్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

Divya
బుల్లితెర యాంకర్ గా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ సినీ రంగంలో స్టార్ డైరెక్టర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ఓంకార్.. బుల్లితెర యాంకర్ స్థాయి నుంచి తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ డైరెక్టర్గా కూడా బాగానే తీర సంపాదించారు.. డాన్స్ రియాలిటీ షో తో బుల్లితెర మీద అన్నయ్యగా కూడా పిలిపించుకున్న ఓంకార్ ఆషో ద్వారా ఎంతోమందిని కొరియోగ్రాఫర్లుగా పరిచయం చేశారు.. ఆట ప్రోగ్రాంతో ఆగిపోకుండా జీనియస్ సినిమా ద్వారా కూడా మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తన మొదటి సినిమా కలిసి రాలేక పోవడంతో మళ్లీ ప్రయత్నించారు..

అలా రాజుగారు గది సినిమాతో ఒకసారి హిట్టు కొట్టిన ఓంకార్ తనెంటో మళ్లీ చూపించారు. ఆ తర్వాత నాగార్జున గారితో రాజుగారిగది-2 సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. రాజు గారి గది-3 కూడా తీశారు..ఎప్పుడూ కూడా చాలా క్రియేటివ్ గా ఆలోచించే ఓంకార్ టెలివిజన్ రంగంలో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. కాకినాడ వాసి అయినప్పటికీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరి వచ్చారు.. ఓంకార్ తండ్రి కృష్ణారావు కాకినాడ పరిసరాలలో కూడా మంచి ఫేమస్ డాక్టర్ అట.. అయితే కేవలం కాకినాడలోని పరిమితి కావడంతో ఓంకార్లు ఒక చెత్త ఆలోచన ఉండేదట..

మొదట క్రికెట్ లో గాని సినిమాలలో గాని ఎదగాలని ఆలోచించారట. అయితే తన తండ్రి కోరిక మేరకు క్రికెట్ను పక్కనపెట్టి ఫిజియోథెరపీ కోర్స్ను కూడా పూర్తి చేయడానికి హైదరాబాద్ కి వచ్చారట. అలా నాలుగేళ్లపాటు ఫిజియోథెరపీగా సేవలు అందించిన ఓంకార్ ఆ తర్వాత ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి సొంతంగా ప్రోగ్రామ్స్ చేసే స్థాయికి కూడా ఎదిగారు. అలా జీ తెలుగులో ఆట ప్రోగ్రాంతో ఓంకార్ గా మంచి పాపులారిటీ సంపాదించిన ఓంకార్.. ఆ తర్వాత ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించారు. ఇప్పటికి పరిశోలకు యాంకర్ గాని వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: