"దేవత" సీరియల్ లో ఊహించని ట్విస్ట్... ?

VAMSI
స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్నటువంటి ధారావాహికలలో అత్యుత్తమైన రేటింగ్స్ ను పొందుతున్న సీరియల్స్ లో "దేవత" సీరియల్ కూడా ఒకటి. "కార్తీక దీపం" తర్వాత "దేవత" సీరియల్ హైలెట్ గా నిలుస్తోంది. అయితే ఆదిత్య రుక్మిణి దూరం కావడం... పదేళ్లు రుక్మిణి ఊహల్లో బ్రతికిన ఆదిత్య అనూహ్యంగా తన మనసును మార్చుకొని సత్యకు దగ్గర కావడం ప్రేక్షకులు అంతగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటిది అక్కడ రుక్మిణీ తన బిడ్డ ఇద్దరు ఉండగా మళ్లీ మధ్యలో ఈ సుత్తి కాన్సెప్ట్ ఏమిటి అంటూ చాలా మంది ఫీల్ అవుతున్నారు. సత్య అలా ఆదిత్యకు దగ్గర కాకుండా ఉంటే బాగుండేది అని నిజంగా బాధపడుతున్నారు. ఏదేమైనా రుక్మిణి తన బిడ్డ దేవి ఇద్దరూ ఆదిత్య చెంతకు చేరి ఒక కుటుంబంగా సంతోషంగా జీవించాలని... అలా సీరియల్ ను మార్చాలని చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ అంశంపై ఎంతో మంది ప్రేక్షకులు ఏం జరుగుతుందో ఏమో అని చాలా టెన్షన్ గా కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సత్య తల్లి అయితే పరిస్థితి ఏమిటి, అటు మాధవ్ ని దేవి నాన్న అని పిలవడం అస్సలు బాగోలేదు. రుక్మిణి కూడా మౌనంగా ఉండటం బాగోలేదు సీరియల్ సూపర్. కానీ ఇకనైనా ఈ లైన్ ను మార్చి ఆదిత్య రుక్మిణి ఒకటి అయితే బాగుంటుందని అందరూ ఆకాంక్షిస్తున్నారు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం అందరూ ఊహించిన విధంగానే త్వరలో సత్య ప్రగ్నెంట్ కాబోతుందట. అయితే లాస్ట్ టైమ్ డెలివరీ సమయంలో ఇబ్బంది అయినట్లుగానే ఈసారి కూడా అవుతుందని... లాస్ట్ టైం బిడ్డ చనిపోగా ఈసారి సత్య క్యారెక్టర్ ను ముగిస్తారని అంటున్నారు.
ఈ లైన్ అందరికీ నచ్చుతుందని ఇలా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక సత్య కు మగ బిడ్డ జన్మిస్తాడట. ఆ బిడ్డను కూడా రుక్మిణినే పెంచుతుందని టాక్. ఇదే కనుక జరిగితే రుక్మిణి ఆదిత్య కలిసిపోతారు. ఇదే కనుక రానున్న సీరియల్ లో జరగబోయేది అయితే ప్రేక్షకులకు అంతకన్నా ఆనందం ఉండదు. ఇప్పటికే  మాధవ్ ఇంట్లో రుక్మిణి రాధగా ఉండడం వలన ఆమెను వారి ఇంటి కోడలు అనుకుంటూ ఉండటం అందుకు రుక్మిణి కూడా మౌనంగా ఉండటం వంటి విషయాలు ప్రేక్షకులకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి సీరియల్ ను ఏ మలుపు తిప్పుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: