వెస్టిండీస్‌తో "మొదటి వన్డే"....భారత జట్టు ప్లేయర్స్ వీళ్ళే..

NCR

వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సీరీస్ లో భారత జట్టు విజయాన్ని తన ఖాతాలో వేసుకుని సీరీస్ గెలుచుకున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు వెస్టిండీస్‌తో వన్డే సీరీస్ లో కూడా చక్కని ఆట తీరు ప్రదర్శించి వన్డే సీరీస్ కూడా గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్నారు భారత ప్లేయర్స్..అయితే ఇందులో భాగంగా వెస్టిండీస్‌తో  గౌహతి వేదికగా ఆదివారం మధ్యాహ్నం నుంచి జరగనున్న తొలి వన్డే మ్యాచ్ కోసం 12 మందితో కూడిన భారత జట్టుని ఈరోజు బీసీసీఐ ప్రకటించింది.

 

ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో 92, 92 పరుగులతో మెరిసిన రిషబ్ పంత్‌ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ ధోనీ కూడా జట్టులోనే ఉండటంతో.. కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జట్టు ఎంపిక తీరు చూస్తుంటే.. రేపు రిషబ్ పంత్ వన్డే అరంగేట్రానికి మార్గం సుగుమమైనట్లేనని తెలుస్తోంది. 


ఇదిలాఉంటే ఓపెనర్లుగా శిఖర్ ధావన్..రోహిత్ శర్మ తమ స్థానాల్ని నిలబెట్టుకోగా.. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లి అంబటి రాయుడు..రిషబ్ పంత్..మహేంద్రసింగ్ ధోని..రవీంద్ర జడేజా‌కి అవకాశం దక్కింది. ఇక బౌలింగ్ విభాగంలో జడేజాతో పాటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్. చాహల్‌ చోటు దక్కించుకోగా.. ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్ ఎంపికయ్యారు.‌


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: