SRH కు షాక్.. IPL 2025కి కమిన్స్ దూరం..?

Veldandi Saikiran
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. అంతేకాదు రిటెన్షన్ రూల్స్ కూడా తీసుకువచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాలకమండలి. రిటెన్షన్ లో ఈసారి ఆరుగురిని... జట్లు తీసుకునేలా ప్లాన్ చేసింది బీసీసీఐ. ఈ మేరకు రూల్స్ కూడా ప్రకటించేసింది. దీంతో.. రిటెన్షన్ చేసుకునే ప్లేయర్ల లిస్టును తయారు చేసే పనిలో పడ్డాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఏ ప్లేయర్ ను అంటిపెట్టుకోవాలి... ఏ ఆటగాన్ని వదులుకోవాలి అనే దానిపై కసరత్తులు చేస్తున్నాయి.

అక్టోబర్ 31వ తేదీ లోపు రిటెన్షన్ లిస్టును... ఐపీఎల్ పాలక మండలి సభ్యులకు ఇవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు అన్ని ఫ్రాంచైజీలకు డెడ్ లైన్ విధించారు. దీంతో ప్లేయర్లను సెలెక్ట్ చేసుకుంటున్న  జట్లు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే హైదరాబాద్ జట్టు గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు  కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్... వచ్చే ఏడాది ఐపిఎల్ లో ఆడబోడని తెలుస్తోంది.

అతని కావ్య పాప కూడా తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారట. ప్యాట్ కమీన్స్ ను...20 కోట్లు పెట్టి.. గత మినీ వేలంలో కొనుగోలు చేశారు కావ్య పాప. అయితే విదేశీ ప్లేయర్లకు అంతలా రేటు పెట్టాల్సిన అవసరం లేదని..  కావ్య పాప ఓ నిర్ణయానికి వచ్చారట. ఆ 20 కోట్లతో ముగ్గురు ఆల్రౌండర్లు వస్తారని... అనుకుంటున్నారట ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య పాప. ఈ మేరకు... అతని వదులుకొని వేరే ప్లేయర్లపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారట.

ముఖ్యంగా మన విదేశీ క్రికెటర్లు కాకుండా మన భారతదేశానికి చెందిన ప్లేయర్లను సెలెక్ట్... లాభం ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నారట. అలాగే వచ్చే సీజన్ కోసం... హైదరాబాద్ కెప్టెన్ గా హెడ్ ను  ఫైనల్ చేసేందుకు కూడా కావ్య పాప రంగం సిద్ధం చేశారట. ఐపీఎల్ 2024 టోర్నమెంటులో అద్భుతంగా హెడ్ ఆడిన సంగతి తెలిసిందే. అందుకే ఆయనకు కెప్టెన్సీ పదవి ఇచ్చి.. బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

srh

సంబంధిత వార్తలు: