రిషభ్ పంత్‌ క్షుద్ర పూజలుఅందుకే చెడుగుడు ఆడుతున్నాడు..?

Veldandi Saikiran

రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో 250 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. టీం ఇండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్ల తేడాతో చెలరేగడంతో 515 పరుగుల లక్ష్యంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగింది. కేవలం 234 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ 82 ఒక్కడే హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించారు.

భారత బౌలర్లు అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రిత్ బూమ్రా ఒక వికెట్ సాధించాడు. ఇదిలా ఉండగా.... మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందుగానే టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ చేసిన పనికి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే చాలామంది ప్లేయర్లు మైదానంలోకి మొక్కి లోపలికి అడుగు పెడతారు. కానీ భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అందరూ షాక్ అయ్యేలా ఓ పని చేశాడు.

బంగ్లాతో టెస్ట్ మ్యాచ్ లో భాగంగా మూడో రోజు ఆట ప్రారంభంలో బ్యాటింగ్ కు వచ్చే సమయంలో రిషబ్ పంత్ తన డ్రెస్సింగ్ రూమ్ లోనే ప్రార్థనలు చేశాడు. అయితే పంత్ ప్రార్ధనలు చేసింది దేవుడు చిత్రపటానికి కాకుండా.... అతను తన బ్యాట్, గ్లవ్స్, హెల్మెంట్ కు ప్రార్థనలు చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఓ టేబుల్ పై తన బ్యాట్, గ్లవ్స్, హెల్మెంట్, వాటి పక్కనే బ్యాట్ పెట్టి పంత్ వాటికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ప్రార్థనలు చేసి వచ్చాడు. అయితే ఆ ప్రార్థనలు కలిసి వచ్చాయేమో మూడవ రోజు ఆటలో పంత్ బ్యాట్ తో అద్భుతంగా రాణించాడు. 109 పరుగులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: