కోహ్లీ, రోహిత్ లకు.. బీసీసీఐ స్పెషల్ ట్రీట్?

praveen
దాదాపు 13 ఏళ్ల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతో నిరీక్షణగా ఎదురు చూస్తున్న కల ఎట్టకేలకు నెర వేరింది. ప్రతిసారి అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ టీమిండియాను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే మొదటి మ్యాచ్ నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకుvపోతున్న టీమ్ ఇండియా కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం దురదృష్టం వెంటాడి చివరికి ఓటమి పాలై ఇంటి బాట పడుతూ వస్తుంది.

 దీంతో ప్రతి సారి కప్పు గెలుస్తుంది అని ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులందరికీ కూడా నిరాశ ఎదురవుతుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇక ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో మాత్రం టీమిండియా అనుకున్నది సాధించింది  ఎలాంటి తప్పిదాలు చేయకుండా పక్క ప్రణాళికతో పరిధిలోకి దిగిన టీమిండియా.. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది. ఇక నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా జరిగిన ఫైనల్ పోరులో అటు సౌత్ ఆఫ్రికాని ఓడించి టైటిల్ విజేత కనిపించింది.

 వరల్డ్ కప్ టైటిల్ దక్కిన దానికంటే శుభ సందర్భం మరొకటి లేదు అని భావించిన టీమ్ ఇండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ అంతర్జాతీయ టి20 కెరియర్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలకు బీసీసీ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది అనేది తెలుస్తుంది  టీమిండియా ప్లేయర్లు ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణించే విస్తారా విమానానికి కోహ్లీ జెర్సీ నెంబర్ 18 రోహిత్ జనసేన 45 ఉండేలా యూకే 1845 నెంబర్ కేటాయించింది. ఇలా ఈ విమానాన్ని వారిద్దరికీ అంకితం చేసింది  కాగా ముంబైకి చేరుకున్న తర్వాత టీమిండియా  ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: