సౌత్ ఆఫ్రికాలోను.. ఐపీఎల్ రూల్ తీసుకురాబోతున్నారట తెలుసా?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరల్డ్ క్రికెట్లో ఎంత ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా కొనసాగుతూ ఉంది ఐపీఎల్. అయితే ఇక ప్రతి ఏడాది సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా బీసీసీఐ ఐపిఎల్ లో ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకువస్తూ ఉంటుంది. అటు ఇంటర్నేషనల్ క్రికెట్లో కనిపించని ఎన్నో రకాల రూల్స్ ఐపీఎల్ లో అమలు అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 ఇలాంటి రూల్స్ లలో అటు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. సాదరణంగా అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు సబ్ స్టిట్యూట్ గా వచ్చినప్పుడు కేవలం ఫీల్డింగ్ చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది  కానీ ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం మ్యాచ్ మధ్యలో ఒక ఆటగాడిని స్వాప్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా జట్టులోకి వచ్చిన ఆటగాడు బౌలింగ్ బ్యాటింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పాలి. కాగా ఐపీఎల్లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని బాగా వాడుకుంటున్నాయి అన్ని టీమ్స్ కూడా. జట్టులోని ఆటగాళ్లను పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకుంటున్నాయి.

 అయితే ఇప్పుడు ఐపీఎల్ లో అమలు చేస్తున్న ఈ ఇంపాక్ట్ క్లియర్ రూల్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహించే సౌత్ ఆఫ్రికా t20 టోర్నీ లోను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. 2025 సీజన్లో దీన్ని ప్రవేశపెట్టాలని లీగ్ నిర్వాహకులు యోచిస్తున్నారట. అక్టోబర్ తర్వాత దీనిపై చర్చించేందుకు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. అయితే 6 జట్లు పాల్గొనబోయే ఈ సౌతాఫ్రికా t20 లీగ్ 2022 నుంచి జరుగుతుంది. ఈ టోర్నీలో రెండుసార్లు సన్రైజర్స్ ఈస్టర్ కేఫ్ జట్టు టైటిల్ గెలుచుకుంది అని చెప్పాలి. అయితే బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా అటు ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుంది అంటూ విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: