ఐపిఎలే ముద్దు.. డబ్బుకోసం ఏమైనా చేస్తారా?

praveen
ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఒకప్పుడు దేశవాళి క్రికెట్లో అద్భుతంగా రానించి ఆ తర్వాత జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాలని అందరు ఆటగాళ్లు కూడా అనుకునేవారు. ఇలా జాతీయ జట్టు తరఫున ఆడటాన్ని గౌరవంగా భావించేవారు. ఇక దేశం తరఫున ఆడి జట్టుకు విజయాన్ని అందిస్తే అంతకంటే లైఫ్ లో కావాల్సింది ఇంకేముంటుంది అని అనుకునేవారు. కానీ ఇప్పుడు క్రికెటర్ల ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది. దేశం తరఫున ఆడటం కంటే డబ్బులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు క్రికెటర్లు. ఇక జాతీయ జట్టుకు ఆడాల్సిన మ్యాచ్లను కూడా వదిలేసి టి20 టోర్నీలలో భాగం కావడానికి తెగ ఆరాటపడుతున్నారు అని చెప్పాలి.

 ఈ మధ్యకాలంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఐపీఎల్ తరహా లోనే t20 టోర్నీలో నిర్వహిస్తున్నాయి. ఈ లీగ్ లలో అన్ని దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా పాల్గొంటున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుండగా ఈ లీగ్ లో కూడా ఎంతో మంది విదేశీ క్రికెటర్లు బాగమయ్యారు. అయితే ఇలా భాగమైన కొంతమంది క్రికెటర్లు ఏకంగా దేశం తరపున ఆడాల్సి ఉన్నప్పటికీ.. ఇక జాతీయ జట్టును కూడా పక్కనపెట్టి ఐపీఎల్లో ఆడటానికి ఆసక్తిని చూపుతున్నారు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు ఎంతో మంది క్రికెటర్లు ఇలా దేశం తరపున ఆడటం కంటే ఐపీఎల్ కి అధిక ప్రాధాన్యత ఇస్తారు అన్న విషయం అందరికీ అర్థమైంది.

 ఇక ఇప్పుడు ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఐపిఎల్ లో ఆడుతున్న 8 మంది న్యూజిలాండ్ క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని పక్కన పెట్టేశారు. పాకిస్తాన్ తో టి20 సిరీస్ ఆడేందుకు నో చెప్పేసారు. దీంతో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విలియమ్సన్, రచిన్ రవీంద్ర, బౌల్డ్, పెర్గ్యూసన్,  హెన్రీ, డారిల్ మిచెల్, శాంట్నర్, ఫిలిప్ లాంటి ఆటగాళ్లు ఏకంగా ఐపీఎల్ కోసం దేశాన్ని పక్కన పెట్టారు అనేది తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా ఐపీఎల్ లోని వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: