మేం చేసిన తప్పు వల్లే.. ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలిచింది : ఎంపైర్

praveen
ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలవాలని ప్రతి ఒక్క టీం కూడా ఆశ పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ జరిగిన ప్రతిసారి కూడా అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతూ.. విశ్వవిజేతగా నిలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అన్ని టీమ్స్.  అయితే ఇలా అన్ని టీమ్స్ కూడా వరల్డ్ కప్ టైటిల్ గెలవడం లక్ష్యంగా బరిలోకి దిగినప్పటికీ టైటిల్ గెలవడం మాత్రం కేవలం ఏదో ఒక టీం కి  మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఎంతో కష్టపడి దూసుకు వచ్చిన జట్లు చిన్నచిన్న పొరపాట్ల కారణంగా ఏకంగా వరల్డ్ కప్ టైటిల్ కోల్పోతే.. ఆ బాధ మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది.  2019 వరల్డ్ కప్ ఫైనల్ సమయంలో కూడా ఇలాంటిదే జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చివర్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయ్ చెప్పాలి. చివరికి అనుహ్య రీతిలో ఇక ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించి వరల్డ్ కప్ విజేతగా అవతరించినది. కానీ ఆ తర్వాత మాత్రం ఇంగ్లాండ్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.

 ఇలా వరల్డ్ కప్ ఫైనల్ సమయంలో ఎంపైర్లుగా వ్యవహరించిన వారిలో మరైస్ ఎరాస్మస్ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ సమయంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ 2019 విజేతగా ఇంగ్లాండ్ అవతరించడానికి తమ పొరపాటే కారణం అంటూ చెప్పుకొచ్చాడు. ఫైనల్లో స్టోక్స్ బ్యాట్ తగిలి బంతి బౌండరీ కి వెళ్ళింది. మరో అంపైర్ ధర్మసేనతో మాట్లాడి ఆరు పరుగులు కూడా ఇచ్చాం. కానీ మరుసటి రోజు మనం పెద్ద తప్పు చేశామని ధర్మసేన అన్నారు. సిక్స్ సిగ్నల్ ఇవ్వకుండా  కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఉండాల్సింది అని ఇద్దరం చర్చించుకున్నాం అంటూ మొరాయిస్ ఎరాస్మస్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: