టీచర్ కాదు.. కామ పిశాచి.. ఏం చేసిందో తెలుసా?
ఇలా ప్రతి ఒక్కరూ గురువే దైవం అని భావిస్తున్న సమయం లో.. కొంత మంది మాత్రం ఏకంగా ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పాలి. తన దగ్గర చదువుతున్న పిల్లలను సొంత పిల్లలుగా భావించి ప్రేమగా చూసుకుంటూ పాఠాలు బోధించాల్సింది పోయి.. నీచమైన ఆలోచన చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏకంగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక ఇలాంటి వారు ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక గణితం టీచర్ చేసిన నిర్వాకం కాస్త ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది.
విద్యార్థులకు లెక్కలు చెప్పాల్సిన ఆ గణితం టీచర్ కామం తో ఊగి పోయింది. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలోని మదన పల్లిలో వెలుగు చూసింది. ఏకంగా పాఠాలు బోధించాల్సిన ఆ టీచర్ పడకింటి పాఠాలు చెబుతుంది. విద్యార్థుల తో కామకోరికలు తీర్చుకుంటుంది. అయితే విషయం తల్లిదండ్రులకు తెలియడం తో వారు నిరసన చేయగా ఆమెను తొలగించారు. మళ్ళీ ఇప్పుడు ఆమె విధుల్లోకి వస్తుందని తెలియడం తో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.