యూజ్ అండ్ త్రో అలవాటేగా.. పఠాన్ పోస్ట్ హార్దిక్ గురించేనా?

praveen
భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా గురించి ప్రస్తుతం ఒక న్యూస్ తెగ వైరల్ గా మారిపోయింది. 2024 ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడటం లేదని.. మళ్లీ తన పాత టీం అయిన ముంబై ఇండియన్స్ జట్టులోకి రాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అదేంటి ముంబై ఇండియన్స్ అతని వదులుకున్న సమయంలో చెంతన చేర్చుకుంది గుజరాత్. అంతేకాదు కెప్టెన్సీ కూడా అప్పగించింది. గుజరాత్ జట్టు అతని నమ్మి కెప్టెన్సీ అప్పగించడం వల్లే అతనిలోనాయకుడి లక్షణాలు ఉన్నాయన్న విషయం అందరికి తెలిసింది.

 ఇక అతను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా సక్సెస్ కావడం వల్ల ఇక టీమిండియా కెప్టెన్ సీరియస్ లో కూడా అందరిని వెనక్కినట్టు ముందుకు వచ్చాడు. ఇక బిసిసిఐ సేలక్టర్లు కూడా అతనిపై నమ్మకం ఉంచి రోహిత్ శర్మకు విశ్రాంతి ప్రకటించినప్పుడల్లా అతనికి తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు అప్పగిస్తూనే వస్తున్నారు. దీంతో రోహిత్ తర్వాత భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకోబోయేది అతని విషయంపై అందరికీ ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. అయితే ఇలా గుజరాత్ జట్టులోకి వెళ్లడం వల్ల హార్దిక్ పాండ్యా కెరీర్ కు ఎంతో లాభం జరిగింది అని చెప్పాలి.

 అలాంటిది ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఎందుకు గుజరాత్ జట్టును వదిలేసి మళ్లీ ముంబైలోకి వెళ్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇలా హార్దిక్ గుజరాత్ నుంచి ముంబై జట్టులోకి షిఫ్ట్ అవుతున్నాడంటూ వార్తల నేపథ్యంలో మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారిపోయింది. వాడుకొని వదిలేయడం.. ఇదే మొదటి నుంచి ఉన్న అసలైన లక్షణం అంటూ ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యాని ఉద్దేశించే ఇర్ఫాన్ పఠాన్.. ఇలాంటి పోస్ట్ పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ అందరు కూడా చర్చించుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా గుజరాత్ ను వాడుకొని వదిలేసాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: