13 ఏళ్లుగా మరదల్ని ప్రేమించాడు.. కానీ చివరికి?

praveen
మనసుకు నచ్చిన వారితో జీవితాన్ని పంచుకొని ఇక వందేళ్లు సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ పడుతూ ఉంటారు. కానీ ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా పెళ్లి వరకు వెళ్లరు. ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వారు కడవరకు కలిసి ఉంటారు అన్న నమ్మకం కూడా ఉండదు. ఇక ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక మరోవైపు ప్రేమించిన వారిని దక్కించుకోలేకపోయాము అన్న బాధతో కొంతమంది కఠిన నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్న ఘటనలు కూడా నేటి రోజుల్లో చాలానే వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి.

 ఇక్కడ ఒక యువకుడు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చాడు. 13 ఏళ్లుగా యువతిని ప్రేమించాడు. జీవితాంతం ఆమెతో కలిసి బ్రతకాలని కలలు కన్నాడు. కానీ తన కలలు కలలుగానే మిగిలిపోయాయి అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారి పల్లెలో వెలుగులోకి వచ్చింది. మురళీమోహన్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.  అదే గ్రామానికి  చెందిన అత్త కుమార్తెను 13 ఏళ్లుగా ప్రేమించాడు. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన పెద్దలు ఒప్పుకోకపోవడంతో పలుమార్లు చర్చలు పెళ్లి వరకు వెళ్లలేదు.

 మురళీమోహన్ ఎన్నిసార్లు అత్తమామలను పెళ్లి కోసం ఒప్పించేందుకు ప్రయత్నించిన వాళ్లు అంగీకరించలేదు. దీంతో మనస్థాపనతో గతంలోనే ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు మురళీమోహన్. కానీ కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత మురళీమోహన్ తల్లిదండ్రులు యువతి తల్లిదండ్రులకు నచ్చదు చెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరికి తెలియకుండా సదరూ యువతకి బలవంతంగా మరో యువకుడితో పెళ్లి చేశారు. విషయం తెలుసుకున్న మురళీమోహన్ జీర్ణించుకోలేకపోయాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: