ధోని క్రేజ్ మాములుగా లేదు గా..టీవీ కి హారతి ఇస్తున్న అభిమాని?
ఇక ఇప్పుడు ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభమైంది. అయితే ప్రారంభ వేడుకల సమయంలో అర్జిత్ సింగ్ ఒక చక్కటి పాటతో అందరిని అలరించాడు. ఓం దేవా దేవా అంటూ అతడు పాడుతుంటే మధ్య మధ్యలో మహేంద్ర సింగ్ ధోని
బిగ్ స్క్రీన్ పై కనిపించడంతో అక్కడ ఉన్న లక్షల మంది జనం గట్టిగా అరిచారు. ఈ సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఇక ఐపీఎల్ 2023 సీజన్ లో తాజాగా లక్నో జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సందర్భంగా టీవీలో మహేంద్ర.సింగ్ ధోని చూడగానే అతడి విరాభిమాని ఏకంగా టీవీకే హారతి ఇవ్వడం, గంట కొట్టడం వంటివి చేశాడు. ఇలా మహికి హారతిస్తూ పూజ చేస్తున్న వీడియో ఆ కుటుంబంలోని ఒకరు సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మామూలుగా సినిమా హీరోలకు పాలాభిషేకాలు చేస్తారు లేదా పోస్టర్లు కడతారు పూలదండలు వేస్తారు అయితే క్రికెటర్ కి ఇలా హారతి ఇచ్చేంత అభిమానం ఉండడం నిజంగా ఎంతో గొప్ప విషయం అని చెప్పొచ్చు.