వరల్డ్ కప్ జట్టులో.. దినేష్ కార్తీక్ ప్లేస్ ఫిక్స్?
ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా ఇదే విషయంపై స్పందించాడు . దినేష్ కార్తీక్ నాలుగో టి20 నాచు లో హాఫ్ సెంచరీతో మెరవడం గొప్ప విషయం అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కాబోయే టి20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా జట్టులో ఇప్పటికే దినేష్ కార్తీక్ తన చోటుని ఖాయం చేసుకున్నాడు అంటూ ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించాడు దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టి20 లో దినేష్ కార్తీక్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన విధానం బాగా నచ్చింది. ఆరో స్థానంలో వచ్చి అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు.
అతడి నుంచి టీమిండియా ఆశిస్తుంది కూడా ఇదే అంటూ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. జట్టులో స్థానం దక్కించుకున్న అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడిగా ప్రస్తుతం దినేష్ కార్తీక్ కొనసాగుతున్నాడు. ఇక చివరి మూడు నాలుగు ఓవర్లలో అతను మంచి పరుగులు చేస్తున్నాడు. ఇటీవల దినేష్ కార్తీక్ చేసిన హాఫ్ సెంచరీ తప్పకుండా సెలెక్టర్లలో నమ్మకాన్ని కలిగిస్తుంది అని నేను అనుకుంటున్నాను. బ్యాటింగ్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ల తర్వాత దినేష్ కార్తీక్ ఉంటాడు. ఆస్ట్రేలియాలోని పిచ్ లపై 200 కంటే ఎక్కువ పరుగులు ఛేదించడం లో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ఉపయోగపడుతుంది అంటూ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.