ఐపీఎల్ 2022: డుప్లిసిస్ ను వదులుకుని ధోనీ తప్పు చేశాడా ?

VAMSI
ఐపీఎల్ పండుగ మొదలైపోయింది. పది జట్లు పోటీ పడుతున్న ఈ క్యాష్ రీచ్ లీగ్ లో అప్పుడే మూడు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు అన్నీ కూడా చేజింగ్ గెలిచాయి. టార్గెట్ ఎంత అయినా సరే... ప్రత్యర్థి ఆటగాళ్ళు ఉతికి ఆరేస్తున్నారు. దీనికి సాక్ష్యమే రాత్రి బెంగళూర్ మరియు పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్. వాస్తవానికి ఇక్కడ గ్రౌండ్ లో బౌండరీలు పెద్దవిగా ఉండడం కారణంగా తక్కువ స్కోర్ మాత్రమే నమోదు అవుతుందని మ్యాచ్ కు ముందు పిచ్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇదంతా కూడా మ్యాచ్ లో మొదటి పది ఓవర్ ల వరకు మాత్రమే. ఆ తర్వాత విధ్వంసం మామూలుగా జరగలేదు.

టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బెంగళూర్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించారు. మొదటి పది ఓవర్లు నెమ్మదిగా సాగిన బెంగళూర్ ఇన్నింగ్స్ తర్వాత సాగిన తీరు చూస్తే ఎవ్వరికీ నమ్మశక్యం కాదు. ముఖ్యంగా బెంగళూర్ కొత్త కెప్టెన్ డుప్లిసిస్ ఆడిన తీరు ఆశ్చర్యకరం. అయితే గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగిన డుప్లిసిస్, ఈ సారి జరిగిన మెగా వేలంలో చెన్నై అంటి పెట్టుకున్న ఆటగాళ్ళల్లో డుప్లిసిస్ లేకపోవడం అందరినీ ఎంతగానో షాక్ కు గురి చేసింది. అయినా వేలంలో కూడా దక్కించుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అయితే గత సంవత్సరం ఐపిఎల్ టైటిల్ నెగ్గడంలో డుప్లిసిస్ కీలక పాత్ర పోషించాడు.

రాత్రి డుప్లిసిస్ చెలరేగిన తీరు చూస్తే చెన్నై యాజమాన్యం ఖచ్చితంగా బాధపడి ఉంటుంది. ఈ విషయంలో ఖచ్చితంగా మాజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని దే తప్పు అని చెప్పాలి. అతని ఆట గురించి బాగా తెలిసిన ధోని వేలంలోనూ కొనడానికి ఆసక్తి చూపకపోవడం దేనికి సంకేతం. ఇప్పుడు అందరూ బాధపడేలా ఇన్నింగ్స్ ఆడాడు. కానీ బౌలర్ల పూర్తి వైఫల్యంతో ౨౦౫ పరుగులు చేసినా మ్యాచ్ ను కాపాడుకోలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: