టీమిండియాకు మరో షాక్.. ఇది ఊహించనిదే?
దీంతో ప్రస్తుతం టీమిండియా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ కారణంగానే టీమ్ ఇండియా ఓటమి చవిచూసింది అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటమితో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. మూలుగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది టీమిండియా పరిస్థితి. ఇటీవలే స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో ఏకంగా 40 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
మూడో వన్డే మ్యాచ్లో నిర్దేశించిన సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ ఓవర్లు వేసిన కారణంగా టీమిండియాకు ఇలా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే టెస్టు సిరీస్ వన్డే సిరీస్ ఓడిపోయి నిరాశలో ఉన్న టీమిండియాకు ఇక ఇప్పుడు మ్యాచ్ ఫీజులో కోత కూడా మరింత నిరాశ మిగిల్చింది అని చెప్పాలి. ఏదేమైనా ఇటీవలికాలంలో ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియా అటు సౌతాఫ్రికా లో మాత్రం వరుసగా పరాజయం పాలుకావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.