India U-19 : ప్రపంచకప్లో కోవిడ్ కలకలం..భారత కెప్టెన్ సహా..!
కొవిడ్ సోకిన భారత ఆటగాళ్లు అందరూ ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు. ఈనెల 17న నలుగురు ఆటగాళ్లకు కరోనా సోకినట్టు నిర్థారణ అయినది. వారితో దగ్గరగా మెలిగిన కొందరికీ పరీక్షలు చేయించగా.. కెప్టెన్, వైస్ కెప్టెన్లకు కూడా పాజిటివ్గా వచ్చింది. అండర్-19 ప్రపంచకప్ గ్రూప్-బిలో ఉన్న భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగినది. అయితే కెప్టెన్, వైస్ కెప్టెన్తో పాటు మరొక నలుగురు ఆటగాళ్లు అందుబాటులో లేరు. అయినప్పటికీ ట్రినిటాడ్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిషాంత్ సింధు కెప్టెన్గా వ్యవహరించాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా కీలక ఆటగాళ్లు లేకపోయినప్పటికీ.. భారత్ అద్భుతమైన ఇన్నింగ్ ఆడింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీస్కోర్ చేసింది.
భారత ఓపెనర్లు అంగ్ క్రిష్ రఘువంశి (79), హరనూర్ సింగ్ (88) వికెట్ పడకుండా 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం.. ఆ తర్వాత రాజ్ భవా (42) ఆచితూచి ఆడాడు. చివరిలో కెప్టెన్ నిషాంత్ (36), రాజ్వర్ధన్ (39) సిక్సర్లతో విరుచుకుపడి భారీ స్కోర్ చేసారు. అయితే తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి శుభారంభం చేసింది. శనివారం యుగాండాతో తలపడనున్నది. గ్రూప్-బీలో భారత్కు ఇదే ఆఖరు మ్యాచ్.