బెంగళూరు కెప్టెన్ గా.. మళ్లీ కోహ్లీనే?
ఈ క్రమంలోనే ఇటీవల తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించి షాక్ ఇచ్చాడు. కోహ్లీ తర్వాత అంతటి స్థాయి కలిగి ఉన్న ఆటగాడు ఎబి డివిలియర్స్ కు అతనికి కెప్టెన్సీ ఇస్తారు అని అందరూ అనుకున్నారు.. కానీ అంతలోనే అతను పూర్తిగా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలోనే ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.
ఐపీఎల్ 2022 సీజన్లో విరాట్ కోహ్లీ మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆర్సిబి యాజమాన్యం విరాట్ కోహ్లీతో చర్చలు జరపగా విరాట్ కోహ్లీ కూడా ఒప్పుకున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి తప్పనిసరిగా కప్పు గెలిపించాలని తానేంటో నిరూపించుకోవాలని విరాట్ కోహ్లీ కసితో ఉన్నాడట. అందుకే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టేందుకు విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు అంటు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ వార్తను చూసి అభిమానులు అందరూ హ్యాపీ అవుతున్నారు అని చెప్పాలి.