T20 WORLD CUP: నేటి నుంచే విశ్వ సంగ్రామం.. టోర్నీ జరిగేది ఇలా..!
టోర్నీ జరిగేది ఇలా...
మొత్తం 33 మ్యాచ్లు సూపర్ - 12 లో జరుగుతాయి. రెండు గ్రూపులు ఉంటాయి. ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. ఈ గ్రూప్లో ఉన్న ఆరు జట్లలో నాలుగు జట్లు నేరుగా అర్హత సాధిచాయి. రెండు జట్లు మాత్రం క్వాలీఫయింగ్ మ్యాచ్ లు ఆడి అర్హత సాధించాయి. అర్హత మ్యాచ్ ల నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్లతో పాటు స్కాట్లాండ్, నమీబియా జట్లు గ్రూప్ 1, గ్రూప్ 2లో యాడ్ అయ్యాయి. ఒక్కో గ్రూప్ లో ప్రతి జట్టు ఐదేసి మ్యాచ్ లు ఆడుతుంది.
ఒక్కో గ్రూప్ నుంచి టాప్ - 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 12 జట్లు రంగంలో ఉన్నా టోర్నీ ఫేవరెట్లు గా నాలుగు జట్లే కప్ రేసులో ముందున్నాయి. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచక్పను ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ గెలుచు కుంది. ఆ తర్వాత భారత్ కు ఒక్క సారి కూడా కప్ దక్కలేదు.