చిన్న పొరపాటుతో మ్యాచ్ ను కోల్పోయిన ఇండియా...
మొదటి వన్ డే లో విమర్శలు ఎదుర్కొన్న ఓపెనర్లు స్మృతి మందన మరియు షెఫాలీ వర్మ ఇద్దరూ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదటి వికెట్ కు 74 పరుగులు జోడించి షెఫాలీ వర్మ (22) వెనుతిరిగింది. మధ్య మధ్యలో వికెట్లు పడుతున్నా లెక్క చేయక ఓపెనర్ స్మృతి మందన 86 పరుగులను సాధించింది. ఒక దశలో భారత్ స్కోర్ 250 చేస్తుందా అనుకున్నా, చివరిలో దీప్తి, పూజ మరియు జులన్ గోస్వామిల ప్రయత్నంతో 274 పరుగులు చేయగలిగింది. ఈ స్కోర్ చూసిన ప్రేక్షకులు ఇక భారత గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. అందుకు తగ్గట్లే భారత్ బౌలర్లు చెలరేగి 52 పరుగులకే నాలుగు కీలక వికెట్లను సాధించి విజయానికి బాటలు వేశారు. కానీ ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.
బెత్ మోని తో జత కలిసిన మేక్ గ్రాత్ భారత్ బౌలర్లను ఆచి తూచి ఆడుతూ స్కోర్ బోర్డును నెమ్మదిగా పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి 126 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలా మ్యాచ్ చివరి ఓవర్ కు 13 పరుగుల వరకు వచ్చింది. ఇక్కడే మిథాలీ చేసిన తప్పుకు భారత్ మూల్యం చెల్లించుకుంది. క్రీజులో ఉన్న బ్యాటర్లు అప్పటి వరకు స్పిన్ ఆడడానికి ఇబ్బంది పడుతున్నారు. 49 ఓవర్ వరకు స్పిన్ వేయించి, చివరి ఓవర్ మాత్రం ఫాస్ట్ బౌలర్ జులన్ కు బంతిని అప్పగించింది. చివరి ఓవర్ లో 13 పరుగులు చేయాల్సి ఉండగా మొదటి అయిదు బంతులకు 10 పరుగులు చేశారు. లాస్ట్ బాల్ కు మూడు పరుగులు చేయాల్సి ఉండగా నో బాల్ వేయడంతో, ఒక రన్ మరియు ఫ్రీ హిట్ వచ్చింది. దానితో లాస్ట్ బాల్ కు లాంగ్ ఆన్ లో షాట్ కొట్టి రెండు పరుగులు పూర్తి చేయడంతో ఓటమిని తప్పించుకున్న ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో సిరీస్ ను మ్యాచ్ ను కైవసం చేసుకుంది.