హిరో నేను కాదు: శార్ధులే- రోహిత్ శర్మ
అయితే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ను అందుకునే సమయంలో అసలైన హిరోను నేను కాదని, శార్ధులే నిజమైన హిరోనని అన్నాడు. అంతే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు పూర్తి అర్హత కలిగినది శార్ధుల్ ఠాకురే అని తన మనసులోని మాట చెప్పాడు. రోహిత్ మాత్రమే కాదు క్రికెట్ అభిమానులు, నెటిజన్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను శార్ధుల్ ఠాకూర్కు ఇవ్వాల్సిందని అన్నారు. శార్ధుల్ ఠాకూర్ నాలుగో టెస్టు మ్యాచ్ లో ఆల్ రౌండర్ అవతారం ఎత్తాడు. మొదటి ఇన్నింగ్స్ లో 57 పరుగులను కేవలం 36 బంతుల్లో నే రాబట్టాడు. ఇది అతనికి టెస్టులో్లనే వేగవంతమైన హాఫ్ సెంచరీ. అలాగే అదే మొదటి ఇన్నింగ్స్ లో 1 వికెటూ పడగోట్టాడు. కగా రెండో ఇన్నింగ్స్ లో 72 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. దీంతో పాటు రెండు వికెట్లనూ తీశాడు. టెస్టు క్రికెట్ లోనే రెండు ఇన్నింగ్స్ ల్లోనూ అర్థ శతకాలు బాధిన తొలి భారతీయుడిగా శార్ధుల్ ఠాకూర్ రికార్డు శృష్టంచాడు.