కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు.. చురకలు అంటించిన గంబీర్..?

praveen
భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత ఇక భారత జట్టులోని ఆటగాళ్ల పేలవ ప్రదర్శన పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆటగాళ్ల తీరును ఎండగట్టడంలో ఎప్పుడూ ముందు ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పిదాన్ని ఎండగట్టడంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎప్పుడూ ముందు ఉండడమే కాదు ఇక తనదైనశైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాడు అనే విషయం ఇద్దరు తెలిసిందే. ఇక ఇటీవల విరాట్ కోహ్లీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న వేళ.. మరోసారి విరాట్ కోహ్లీ పై విమర్శలు గుప్పించాడు గౌతమ్  గంభీర్.



 ఇప్పటికే మొదటి టెస్టులో టీమిండియా జట్టును ఓటమి పాలు చేసిన విరాట్ కోహ్లీ సారథ్యం పై విమర్శలు వస్తుండగా ఇక రెండవ టెస్ట్ లో  బాగా రాణిస్తాడు అని అనుకున్నప్పటికీ.. ఇక ఒక స్పిన్నర్ చేతిలో ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరడంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక దీనిపై స్పందించిన గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ తీరుపై చురకలంటించాడు.  మొయిన్ అలీ బౌలింగ్లో విరాట్ కోహ్లీ చెత్త షాట్ ఆడి  అవుట్ అయ్యాడు అని గౌతం గంభీర్ విమర్శించారు.



 నా వరకైతే విరాట్ కోహ్లీ ఆడింది ఒక చెత్త షాట్  అని..  ఎందుకంటే చెపక్  లాంటి పిచ్ పై  అది ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్లో మరీ ముఖ్యంగా రన్  ప్లేస్ లో అతను బంతుల్ని విస్తరిస్తున్న సమయంలో డ్రైవ్ ఆడితే  పర్యావసనలు  అలాగే ఉంటాయి. ఏ ఆటగాడైనా సరే  క్రీజూ లో సెటిల్ అవ్వకముందు ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్లో అలా కవర్ డ్రైవ్ ఆడకూడదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నిర్లక్ష్యంగా అలాగే ఆడితే  జరగాల్సిన నష్టం  జరిగిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు గౌతం గంభీర్.  గౌతం గంభీర్ మాత్రమే కాదు ఒక్క పరుగు కూడా చేయకుండా కోహ్లీ  నేను వెనుదిరగడంపై మాజీలు  సైతం విమర్శలు గుప్పిస్తున్నారు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: