బట్లర్ కి ధోని అద్భుతమైన గిఫ్ట్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కంటే ఎంతో విలువైనది..?
నూట ఇరవై ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు... ఆరంభంలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతో ఇక రాజస్థాన్ పని అయిపోయింది అని అనుకున్నారు అందరు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారీగా సిక్సర్లు ఫోర్లు బాదడంతో సునాయాసంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుపొందింది. 70 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చిన బట్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే.
అయితే జోస్ బట్లర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కంటే ఎంతో విలువైన బహుమతి దక్కింది. ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు సాధించిన జోస్ బట్లర్ కు చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన జెర్సీని జోస్ బట్లర్ కు బహూకరించాడు. సాధారణంగానే బట్లర్ కి ధోని అంటే అమితమైన అభిమానం అన్న విషయం తెలిసిందే పలు ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ఇక తన అభిమాన క్రికెటర్ ఏకంగా జస్సీ గిఫ్ట్ ఇవ్వడం తో జోస్ బట్లర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.