తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన టీ 20 సిరీస్ .. టీమిండియా యువ ఓపెనర్ కేఎల్ రాహుల్ కు చిరకాలం గుర్తిండిపోతుందనడం లో సందేహం అవసరం లేదు. కేవలం ఈ సిరీస్ లో అతను బ్యాట్స్ మెన్ గానే కాదు కీపర్ గా అలాగే చివరి టీ 20లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడడం తో తన స్థానం లో కెప్టెన్సీ చేసి కూడా సక్సెస్ అయ్యాడు. దాంతో రాహుల్ భవిష్యత్తులో కాబోయే కెప్టెన్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇక ఈసిరీస్ లో రాహుల్ పలు రికార్డులు సృష్టించాడు. అందులో భాగంగా ఈ సిరీస్ లో 5మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలతో కలిపి రాహుల్ మొత్తం 224 పరుగులు చేశాడు. తద్వారా ద్వైపాక్షిక టీ 20సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన మొదటి భారత ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. అలాగే మొదటి రెండు టీ 20ల ద్వారా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన మొదటి భారత వికెట్ కీపర్ కూడా అతనే కావడం విశేషం.
ఇక ఓపెనర్ గా టీ 20ల్లో వేగంగా 1000పరుగులు పూర్తి చేసిన ఘనతను కూడా సాదించాడు అలాగే టీ 20 ల్లో ఓ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా అతనే అంతేకాదు టీ 20ల్లోమొదటి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ను గెలుచుకున్న మొదటి భారత వికెట్ కీపర్ గా కూడా రాహుల్ రికార్డు సృష్టించాడు. మొత్తానికి ఈసిరీస్ రాహుల్ కెరీర్ కు చాలా ఉపయోగపడింది.