ఇటీవల భారత క్రికెట్ లో పదే పదే విమర్శలకు గురైవుతున్న క్రికెటర్ ఎవరనగానే మనకు గుర్తొచ్చే పేరు రిషబ్ పంత్..ఆటతో ఫేమస్ కావల్సింది పోయి ట్రోలింగ్ తో ఫేమస్ అవుతున్నాడు ఈయువ క్రికెటర్. ట్యాలెంటెడ్ ఆటగాడు అంటూ పంత్ కు ఏ క్రికెటర్ కు ఇవ్వనన్నీ అవకాశాలు ఇస్తుంది మేనేజ్మెంట్. ముఖ్యంగా అతనికి కోహ్లీ , రవిశాస్త్రి మద్దతూ ఎక్కువగా వుంది. దాంతో వరుసగా విఫలమవుతున్న అవకాశాలు సంపాదిస్తున్నాడు పంత్.
అయితే ఆ అవకాశాలను వినియోగించుకోవడంలో మాత్రం పంత్ దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. దాంతో అతని పై టీమిండియా క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న టీ 20 సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఎక్కువ స్కోర్ చేయకపోయినా కీలక సమయంలో దూకుడుగా ఆడడం తో అమ్యాచ్ లో అందరు అతన్ని వెనకేసుకొచ్చారు. ఆతరువాత మ్యాచ్ లోనూ 33పరుగులతో నాటౌట్ గా నిలవడంతో అప్పుడు కూడా పంత్ కు సపోర్ట్ లభించింది.
అయితే తాజాగా ముంబై లో జరుగుతున్న చివరి టీ 20మ్యాచ్ లో మాత్రం మరోసారి మంచి అవకాశం వస్తే చెత్త షాట్ తో డకౌట్ అయ్యాడు. ఓవైపు సహచరులు రాహుల్ , రోహిత్ , కోహ్లీ సిక్సర్ల తో చెలరేగగా పంత్ మాత్రం ఇలా వచ్చి ఆలా వెళ్ళాడు దాంతో ప్రస్తుతం పంత్ పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్ని ఛాన్సులు ఇస్తారు ? మీరెన్ని ఛాన్సులు ఇచ్చిన అతని ఆట తీరు మారదు. పంత్ ను తీసేసి సంజు శాంసన్ ను తీసుకోండి బీసీసీఐ కు సూచిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.