గోవులను ఎందుకు అంతలా పూజిస్తారో తెలుసా...?

VAMSI
హిందూ సంస్కృతి యొక్క గొప్ప తనాన్ని పూర్వం ఉపనిషత్తులలో తగు విధంగా వివరించబడినవి. ఇవి మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని ప్రస్తుత కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతి రోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు. వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్నిపెంచడానికి దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ద్వారా పూర్వం రోజుల్లో పండితులకు, గోవులకు భారతీయ సమాజంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది....

1. ఓం సహనావవతు,
సహనౌ భునక్తు,
సహవీర్యం కరవావహై,
తేజస్వినా వధీతమస్తు,
మావిద్విషావహై ఓం శాంతి: శాంతి: శాంతి...

తాత్పర్యం:-  సర్వ జీవులు రక్షింపబడుగాక... సర్వ జీవులు పోషింపబడుగాక... అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పని చేయాలి ( సమాజ ఉద్ధరణ కోసం )... మన మేధస్సు వృద్ది చెందుగాక... మన మధ్య విద్వేషాలు రాకుండు గాక... ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.

2. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..  
ఓం సర్వేషాం శాంతిర్భవతు..
ఓం సర్వేషాం పూర్ణం భవతు..
ఓం సర్వేషాం మంగళం...

తాత్పర్యం:-  సర్వులకు సుఖము, సంతోషము కలుగుగాక..  సర్వులకు శాంతి కలుగు గాక..  సర్వులకు పూర్ణ స్థితి కలుగుగాక.. సర్వులకు శుభము కలుగుగాక..

3. ఓం అసతోమా సద్గమయ,
తమసోమా జ్యోతిర్గమయ,
మృత్యోర్మా అమృతంగమయ..  
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:- సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అసత్యము ( మిధ్య ) నుంచి సత్యమునకు గొనిపొమ్ము....( అజ్ఞానం అనే ) అంధకారము నుండి ( జ్ఞానస్వరూపమైన ) వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము....

 పైన చెప్పిన శాంతి మంత్రములు చదివి అర్ధం చేసుకోండి. మన హిందూ సంస్కృతీ ఎంత గొప్పదో తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: