గురు పౌర్ణమి స్పెషల్ : గురు పౌర్ణమి నాడు గురువుని పూజిస్తే ఆ ఆశీర్వచనాలు వేయి రేట్లు ఎక్కువట... !!!
హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు.శిష్యులకు ఆయన జ్ఞానాన్ని, వెలుగును ప్రసాదిస్తాడు. పురాణాల ప్రకారం దేవతల గురువు బృహస్పతి కాగా.. ఆయన సప్తరుషుల్లో ఒకడైన అంగీరసుడి పుత్రుడు. బృహస్పతి బాల్యంలోనే మహా పండితుడిగా కీర్తింపబడ్డాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యాడు. వేదాలను అవపోసన పట్టి, శాస్ర్తాలను లోతుగా పరిశీలించి అన్ని విధాలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.బృహస్పతి పరమేశ్వరున్ని పూజించి ఆయన మెప్పు పొందాడు.
అందుకనే గురువారం బృహస్పతిని స్మరిస్తూ నామకరణం చేయబడింది.హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.అలాగే లోకానికి అంతటికి జ్ఞానాన్ని అందించిన గురువు వేదవ్యాసుడు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు.
వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. మాములు రోజుల్లో కన్న ఈరోజున ఈ గురుపౌర్ణమి నాడు గురువు నుంచి వెలువడే ఆశీర్వచనాలు వేయి రేట్లు ఎక్కువగా పొందవచ్చునట..Powered by Froala Editor