అభిమానులని ఖుషి చేసిన ధోని?

Purushottham Vinay
ఇక ఐపీఎల్‌ నుంచి మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఎప్పటి నుంచో చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ అయిన ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కావచ్చని అందరూ భావిస్తున్నారు.అయితే ఈ విషయంపై ధోనీ ఇప్పుడు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రిటైర్మెంట్ గురించి తాను ఏమనుకుంటున్నాడో ఎట్టకేలకు ధోని వెల్లడించాడు. బుధవారం నాడు లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌పై ధోనీ మాట్లాడుతూ..కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. ఇదే తన చివరి ఐపీఎల్ అని ఇంకా నిర్ణయించుకోలేదని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు.టాస్ సమయంలో డానీ మారిసన్ ఇదే లాస్ట్ ఐపీఎల్ అని ధోనిని అడిగాడు.. దీనిపై ధోని సమాధానమిస్తూ.. కాదంటూ గట్టిగా చెప్పేశాడు. ధోని ఐపీఎల్ ప్రారంభం నుంచి అంటే 2008 వ సంవత్సరం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. గత కొన్ని సీజన్లుగా ఆయన రిటైర్మెంట్ గురించి నిరంతరం ఊహాగానాలు వస్తున్నాయి.


మహేంద్ర సింగ్ ధోని 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు.కానీ ఆయన నిరంతరం ఐపీఎల్ ఆడుతున్నాడు. 2020 సంవత్సరంలో కూడా, ఐపీఎల్‌లో టాస్ సమయంలో ధోని రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా, ధోనీ అస్సలు కాదంటూ అప్పుడు చెప్పుకొచ్చాడు. ఆయన ఆ తర్వాత కూడా IPL ఆడాడు. 2021లో జట్టుకు నాల్గవ IPLని కూడా గెలిపించాడు. ఇక ఈసారి కూడా ధోనీ అదే పని చేశాడు. ధోని తరువాత సీజన్‌లో కూడా కనిపించవచ్చని దీన్ని బట్టి ఊహించవచ్చు.మహేంద్ర సింగ్ ధోనీ గత సీజన్‌లో తన రిటైర్మెంట్ గురించి కూడా చెన్నై అభిమానుల ముందు వీడ్కోలు చెప్పకపోతే అది అభిమానులకు సరైనది కాదంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఈ ఏడాది కూడా ధోని మైదానంలోకి వచ్చాడు.ఇక రిటైర్‌మెంట్‌పై ధోనీ మళ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దీనిని బట్టి పూర్తిగా తెలుస్తోంది. అంటే వచ్చే సంవత్సరం ఐపీఎల్‌లో కూడా కనిపించవచ్చు.ఈ న్యూస్ తెలిసి ధోని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: