హమ్మయ్య.. 14 నెలల తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్లపాటు ఫామ్ కోల్పోయి ఎంతలా ఇబ్బంది పడ్డాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే ఇలా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు అని తెలిసినప్పటికీ అతన్ని జట్టు నుంచి పీకి పారేయాలి అంటూ ఎంతో మంది విమర్శలు చేయడం కూడా చూశాం.

 ఇలాంటి గడ్డు పరిస్థితులనుంచి బయటపడిన విరాట్ కోహ్లీ ఇక ఆ తర్వాత మునుపటి ఫామ్ అందుకున్నాడు అని చెప్పాలి. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వరుసగా సెంచరీలు చేస్తూ మళ్ళీ రికార్డుల వేట ప్రారంభించాడు విరాట్ కోహ్లీ. అయితే పరిమిత ఓవర్లు ఫార్మాట్లో అయితే బాగా రాణించడం మొదలు పెట్టాడు. కానీ ఇక సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో మాత్రం విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. చాలా ఇన్నింగ్స్ ల నుంచి కనీసం విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి అర్థ సెంచరీ కూడా రాకపోవడంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు.

 అయితే ఎట్టకేలకు ఇటీవల  ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి అభిమానులు అందరిని కూడా సంతోషంగా మునిగిపోయేలా చేశాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు అని చెప్పాలి. అంతకు ముందు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లలో కూడా భారీ స్కోర్లు చేయడంలో విఫలమైన కోహ్లీ.. ఇక నాలుగో టెస్ట్ లో మాత్రం కాస్త గాడిన పడినట్లు తెలుస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని 59పరుగుల వద్ద కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఇన్నింగ్స్ ను ఎక్కడ వరకు కోహ్లీ తీసుకువెళ్తాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: