నేడే ఫైనల్ మ్యాచ్.. ఈసారి వరల్డ్ ఛాంపియన్ ఎవరు?

praveen
సౌత్ ఆఫ్రికా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టి20 మహిళల వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు అందరూ ఎదురుచూస్తున్న ఉత్కంఠ భరితమైన ఫైనల్ పోరు జరగబోతుంది. ఈ ఫైనల్ పోరులో భాగంగా మొదటిసారి ఫైనల్ లో అడుగుపెట్టిన సౌత్ ఆఫ్రికా జట్టు ఇక ఇప్పటికే వరల్డ్ కప్ చరిత్రలో పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టు కూడా హోరాహోరీగా తలబడబోతున్నాయి అని చెప్పాలి. అయితే ఈ రెండు జట్లలో ఆస్ట్రేలియా ఫైనల్ కు వెళుతుందని ముందు నుంచి అంచనాలు ఉన్నప్పటికీ.  అటు సౌత్ ఆఫ్రికా మాత్రం అంచనాలను తారుమారు చేసి ఫైనల్ లో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే.

 ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఫైనల్ కు చేరుకోలేదు. నాకౌట్ దశకు చేరుకుంది కూడా చాలా తక్కువే అని చెప్పాలి. ఈ క్రమంలోనే లీగ్ మ్యాచ్లో కూడా జరిగిన నాలుగు మ్యాచుల్లో కేవలం రెండే రెండు విజయాలు మాత్రమే సాధించింది సౌత్ ఆఫ్రికా. కానీ అదృష్టవశాత్తు నెట్  రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో మిగతా జట్లన్ని వెనక్కి నెట్టి ఇక సెమి ఫైనల్ లో అడుగుపెట్టింది. అయితే సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అద్భుతంగా రాణించిన సౌత్ ఆఫ్రికా జట్టు చివరికి పటిష్టమైన ఇంగ్లాండును ఓడించింది అని చెప్పాలి.

 దీంతో ఇక మహిళల టి20 వరల్డ్ కప్ చరిత్రలో మొదటిసారి సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఫైనల్ లో పటిష్టమైన ఆస్ట్రేలియా తో తలబడబోతుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే నాలుగు సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. అలాంటి పటిష్టమైన జట్టును ఇక సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్లో ఏ మేరకు ఎదుర్కోగలుగుతుంది.. ఎంత మేరకు పోటీ ఇవ్వగలుగుతుంది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ఇండియా ఫైనల్ లో లేకపోవడంతో మ్యాచ్ చూడడానికి ఇష్టం లేకపోయినా. ఇక క్రికెట్ మీద ఉన్న మక్కువతో  భారత క్రికెట్ అభిమానుల సైతం ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: