నేను బౌలింగ్ చేయడం నీకు ఇష్టం లేదా.. జడేజాకు అక్షర్ ప్రశ్న?

praveen
బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా  భారత పర్యటనకు వచ్చింది. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత స్పిన్ విభాగం ఎంతో అద్భుతంగా రాణిస్తుంది. ముఖ్యంగా గాయం కారణంగా దాదాపు 5 నెలలపాటు జట్టుకు దూరంగా ఉన్న జడేజా  అయితే తన స్పిన్ బౌలింగ్ తో అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. రెండు మ్యాచ్లలో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నాడు.

 ముఖ్యంగా రెండవ టెస్ట్ మ్యాచ్ లో అయితే ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. ఇక మిగతా మూడు వికెట్లను రవిచంద్రన్ అశ్విన్ పడగొట్టాడు. దీంతో ఇక ఆస్ట్రేలియా జట్టు ఆల్ అవుట్ అయ్యింది. అశ్విన్, జడేజా మంచి ఫామ్ కనబరచడంతో ఇక మరో స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్ కు కేవలం ఒకే ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది అని చెప్పాలి.  అయితే మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై జడేజా అక్షర పటేల్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది అని చెప్పాలి.

 మొత్తంగా రెండవ టెస్టు రెండవ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 12.1 ఓవర్లు వేసి ఏడు వికెట్లు పడగొడితే రవిచంద్రన్ అశ్విన్ 16 ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ మాత్రం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ వేశాడు. దీని గురించి జడేజాను ప్రశ్నిస్తూ సర్ బౌలింగ్ వేయడానికి నాకు ఛాన్స్ రాలేదు. నేను బౌలింగ్ చేయడం మీకు ఇష్టం లేదా.. మీరు బాగా బౌలింగ్ చేయడానికి ఇదే కారణమా అంటూ సరదాగా ప్రశ్నించాడు. దీంతో ఇక ఇద్దరు కూడా కాసేపు నవ్వుకున్నారు అని చెప్పాలి. అయితే తన స్పిన్ బౌలింగ్ గురించి జడేజా స్పందిస్తూ... భారత్లో పిచ్ లు ఇలా ఉంటే బాగుంటుంది.  స్పిన్నర్ల బాధ్యత మరింత పెరుగుతుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు స్వీప్ షాట్ ఆడెందుకు ప్రయత్నిస్తే.. నేను స్టంప్స్ ని టార్గెట్ చేస్తూ బంతులు వేశాను అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: