అత్యాచారం చేసిన క్రికెటర్ పై.. నిషేధం ఎత్తివేత?

praveen
ఇటీవల కాలంలో కొంతమంది క్రికెటర్లు ఏకంగా మహిళలను వేధించిన ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్కు దూరం అవుతున్నారు . మరి కొంతమంది క్రికెటర్లు ఇక అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని చివరికి నిషేధానికి గురవుతున్నారు అని చెప్పాలి. కేవలం క్రికెట్లో మాత్రమే కాదు ఇతర ఆటల్లో కూడా కొంతమంది స్టార్ ప్లేయర్లు ఇలా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడం సంచలనంగా మారుతుంది. ఇకపోతే నేపాల్ క్రికెట్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఏకంగా నేపాల్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగిన సందీప్ లమీఛానే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేపాల్ క్రికెట్ బోర్డు అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

 ఇక ఇలాంటి ప్లేయర్లపై నేపాల్ క్రికెట్ బోర్డు సరైన నిర్ణయం తీసుకుంది అంటూ ఎంతో మంది ప్రేక్షకులు కూడా భావించారు. అయితే ఇక ఇప్పుడు నేపాల్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. ఏకంగా అత్యాచార ఆరోపనులు ఎదుర్కొంటున్న సందీప్ పై  విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు రెడీ అయింది. నేపాల్ క్రికెట్ బోర్డు ఈనెలాకరున జరగబోతున్న వరల్డ్ కప్ లీగ్ ట్రై సిరీస్ లో మళ్లీ సందీప్ మైదానంలోకి దిగబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 ఇటీవల జరిగిన నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సమావేశంలో సందీప్ పై ఉన్న నిషేధం ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇక ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. ఇక ట్రై సిరీస్ లో భాగంగా నమీబియా, స్కాట్ ల్యాండ్ జట్లతో అతడు మళ్లీ నేపాల్ జట్టు తరఫున ఆడబోతున్నాడు. 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం కేసులో సందీప్ అరెస్టు అయ్యాడు సందీప్. అయితే అతనికి కోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ వచ్చింది అన్నది తెలుస్తుంది. అయితే అతను విదేశీ పర్యటనలో ఆడతాడో లేదో అన్నదానిపై మాత్రం పూర్తి క్లారిటీ లేదు. కేవలం కోర్టు అనుమతిస్తేనే విదేశీ పర్యటనకు వెళ్లేందుకుఅవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: