వైరల్ : రిపోర్టర్ ప్రశ్నతో.. బాబర్ మైండ్ బ్లాక్?

praveen
ప్రస్తుతం భారత దాయాది దేశమైన పాకిస్తాన్ జట్టు అటు స్వదేశీ పర్యటనకు వస్తున్న విదేశీ జట్లతో వరుసగా టెస్టు సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో సొంత గడ్డపై పరువు నిలబెట్టుకునేందుకు టెస్ట్ సిరీస్ లో పోరాడుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవలే మొదటి టెస్ట్ మ్యాచ్  లో భాగంగా గెలవాలనుకున్న పాకిస్తాన్ కు షాక్ తగిలింది. ఎందుకంటే మ్యాచ్ డ్రాగ ముగిసింది.

 ఒకానొక సమయంలో పాకిస్తాన్ జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోతుంది అనే పరిస్థితి ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇక జట్టు ఆటగాళ్లు బాగా రాణించడంతో చివరికి ఓటమి నుంచి గట్టెక్కి డ్రాగ మ్యాచ్ ను ముగించుకుంది అని చెప్పాలి. అయితే మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పాల్గొన్నారు. అయితే మ్యాచ్ గురించి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఓ జర్నలిస్టు తీవ్రంగా స్పందించారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నవారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. మేము ప్రశ్నలు అడగకముందే మీ మీడియా మేనేజర్ మైక్ ఆఫ్ చేశాడు అంటూ బాబర్ అజాంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు జర్నలిస్టు.

 జర్నలిస్టు ఇలా కాస్త చిర్రుబుర్రు లాడడంతో అటు కెప్టెన్ బాబర్ కి కూడా కోపం వచ్చింది. ఏకంగా ఇలా ఘాటుగా ప్రశ్నించిన జర్నలిస్టు వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. రిపోర్టర్ బాబర్ను గట్టిగా ప్రశ్నించడంతో అతని ముఖం ఒక్కసారిగా బిక్క పోయింది. ఇక ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: