నిన్నే సురేష్ రైనా రిటైర్మెంట్.. అంతలోనే గుడ్ న్యూస్?

praveen
ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన బ్యాటింగ్ తో  కొన్నిసార్లు బౌలింగ్తో ఎన్నోసార్లు ఫీలింగ్తో ప్రేక్షకులందరినీ నేర్పించిన సురేష్ రైనా టీమ్ ఇండియా తరఫున అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా కొనసాగారు అని చెప్పాలి. అయితే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా కొనసాగినన్ని రోజులు కూడా టీమిండియాలో వరుసగా అవకాశాలు దక్కించుకున్న సురేష్ రైనా ఇక ఆ తర్వాత ధోనీ కెప్టెన్సీ నుంచి ఎప్పుడైతే తప్పుకున్నాడో.. అప్పటి నుంచి  కేవలం అడపాదడపా అవకాశాలు మాత్రమే అందుకుంటూ వచ్చాడు. యువ ఆటగాళ్లు నుంచి పోటీ ఎక్కువైన నేపథ్యంలో ఇక ఆయనకు అవకాశాలు లేకుండా పోయాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ధోనీతో పాటు తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. అయితే ఐపీఎల్లో అయిన తమ అభిమాన ఆటగాడి ఆటను చూస్తున్నామని ఫ్యాన్స్ అనుకున్నారు.  ఇటీవలే అటు దేశవాళి క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇందుకు కారణం గత ఏడాది అతన్ని ఫ్రాంచైజీ క్రికెట్ లో ఎవరూ కొనుగోలు చేయకపోవడమే అన్నది తెలుస్తోంది. ఇక సురేష్ రైనా షాకింగ్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక తమ అభిమాన క్రికెటర్ ఆటను చూడలేమా అని అందరూ అనుకున్నారు.

 ఈ క్రమంలోనే ఇప్పుడు సురేష్ రైనా అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ అందింది. అన్ని ఫార్మాట్ల నుండి తప్పకున్న సురేష్ రైనా మళ్ళీ క్రీజులోకి వస్తున్నాడు అన్నది తెలుస్తుంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండవ సీజన్ కోసం ఇండియా లెజెండ్ సిరీస్ లో సురేష్ రైనా చేరబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ విషయాన్ని రోడ్ సేఫ్టీ వరల్డ్ అధికారులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో సురేష్ రైనా ఆటను మరోసారి చూసేందుకు అభిమానులు అందరూ కూడా సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: