నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

Chakravarthi Kalyan
నారా లోకేశ్‌ ను సీఎం జగన్‌ తానే స్వయంగా హీరోగా చేస్తున్నారా.. జనంలో పెద్దగా క్రేజ్‌లేని నారా లోకేశ్‌కు జగన్‌ కష్టపడి ఇమేజ్‌ తీసుకొస్తున్నారా... కావాలని చేయకపోయినా.. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు నారా లోకేశ్‌కు కలసి వస్తున్నాయా.. అంటే అవుననే చెప్పాలి.. ఇందుకు నిన్న గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటనే ఇందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. గుంటూరులో దారుణ హత్యకు గురైన ఎస్సీ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్ వెళ్లారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ నేతలు వచ్చారు.

నారా లోకేశ్‌ ను, టీడీపీ నేతలను పరామర్శించనిచ్చే అవకాశం ఇచ్చి ఉంటే సరిపోయేది.. సింపుల్‌గా అయిపోయేది.. కానీ.. దీన్ని వైసీపీ సర్కారు నానా హంగామా చేసింది. వైసీపీ కార్యకర్తలు కూడా అదే సమయంలో రావడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సమయంలో పోలీసులు తెలుగుదేశం నేతలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు పోలీసులు యత్నించారు. అప్పుడే తోపులాట చోటు చేసుకుంది. నారా లోకేశ్‌ తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను  పోలీసులు లాక్కెళ్లి వ్యాన్‌లో పడేశారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోనీ.. అక్కడితే ఇష్యూ అయిపోయిందా అంటే అదీ లేదు.. సాధారణంగా ఇలాంటి విషయాల్లో నాయకులను అరెస్టు చేసి వెంటనే వదిలేస్తారు..కానీ.. నారా లోకేశ్‌ను  అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత ఆయన్ను అనేక పోలీసు స్టేషన్లకు తిప్పారు. మొదట ప్రత్తిపాడు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తిప్పారు. పెదనందిపాడు, పొన్నూరు, గుంటూరు.. ఇలా చివరకు పెదకాకాని స్టేషన్‌కు తరలించారు.

ఇలా మొత్తం 7 గంటలు తిప్పి... ఆ తర్వాత విడుదల చేశారు. ఈ మొత్తం సీన్ అంతా తెలుగుదేశం అనుకూల మీడియా బ్రహ్మాండంగా హైప్‌ క్రియేట్ చేసింది. మొత్తానికి ఇలా జగన్ నారా లోకేశ్‌ ను హీరోను చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: