హెరాల్డ్ సెటైర్ : సబ్బం దెబ్బకు పరువు పోగొట్టుకున్న చంద్రబాబు
సీన్ కట్ చేస్తే బూతులు తిట్టిన సబ్బం క్షమాపణ చెప్పుకున్నాడు బాగానే ఉంది. మరి సబ్బంను చూసి అవసరం లేకపోయినా ఆవేశాన్ని తెచ్చుకుని ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు సంగతేంటి ? ఇక్కడ విషయం ఏమిటంటే సబ్బం మున్సిపల్ పార్కు స్ధలం 200 గజాలను ఆక్రమించేసుకున్నాడు. స్ధలాన్ని ఆక్రమించేసుకున్న సబ్బం అందులో టాయిలెట్లు కట్టుకున్నాడు. విశాఖ మేయర్ గాను ఎంపిగా చేసిన సబ్బంకు తాను చేస్తున్నది తప్పని బాగా తెలుసు. తెలిసీ ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంతకాలం ఎంతమంది ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే పదేళ్ళు సబ్బమే ప్రజాప్రలినిధిటా ఉన్నాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన కారణంగా అధికార వ్యవస్ధ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. 2014లో విభజన తర్వాత సబ్బం అధికార టీడీపీలో చేరాడు కాబట్టి సబ్బం జోలికి ఎవరు వెళ్ళలేదు.
సీన్ కట్ చేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వానికి కూడా సబ్బం ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయి. దాంతో అన్నీ విషయాలపైనా విచారణ జరిపించిన ప్రభుత్వం ఆక్రమణలపై నోటీసులిచ్చింది. నోటీసులను తీసుకోవటానికి సబ్బం రెజెక్ట్ చేయటంతో దాన్ని ఇంటికి అంటించేశారు. మరుసటి రోజే అంటే శనివారం తెల్లవారే కాంపౌండ్ ను కూల్చేశారు. తాను ఆక్రమించుకున్న స్ధలాన్ని మున్సిపాలిటీ తిరిగి స్వాధీనం చేసుకోవటాన్ని సబ్బం తట్టుకోలేకపోయాడంటే అర్ధముంది. మరి చంద్రబాబుకు ఏమైంది ? గుడ్డిగా సబ్బంను సమర్ధించటమేనా ? ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించుకున్న సబ్బంకు గడ్డిపెట్టాల్సిన చంద్రబాబు తన స్ధాయిని తానే దిగజార్చుకున్నట్లయ్యింది.